చిత్తూరు: నాడు-నేడులో అపశ్రుతి.. స్కూల్ భవనం కూలి కార్మికుడి మృతి

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు-నేడులో అపశ్రుతి చోటుచేసుకుంది. పాఠశాలలో పనులు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా భవనం కూలిపోవడంతో కూలీ మృతిచెందిన విషాద సంఘటన జిల్లాలో చోటుచేసుకుంది. పరిధిలోని పెద్దపంజాణి మండలం బొమ్మలకుంటకు చెందిన ఆనంద్‌కుమార్ కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పుంగనూరులోని బసవరాజ ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న నాడు-నేడు పనులకు వచ్చిన ఆనంద్‌కుమార్ పనిలో ఉండగా ఒక్కసారిగా స్కూల్ భవనం కుప్పకూలింది. వరండా కింద ఉన్న పనుల్లో ఉన్న ఆనంద్ కుమార్‌ భవనం స్లాబ్ కూలడంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన తోటికూలీలు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2AxCDKG

Post a Comment

0 Comments