కేరళలో గర్భిణి ఏనుగు మృతి ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ మహారాష్ట్రలో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ శునకాన్ని బైక్ వెనకాల కట్టేసి ఈడ్చుకెళ్లారు. సుమారు కిలోమీటర్ దూరం వరకు అలా ఈడ్చుకెళ్లారు. ఈ అమానవీయ ఘటనను బైక్ వెనకాల వస్తున్న వాహనదారులు తమ సెల్ఫోన్లో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఆ వీడియో వైరల్గా మారింది. శునకాన్ని బైక్కు కట్టేసి అత్యంత దారుణంగా ఈడ్చుకెళ్తున్న ఇద్దరు వ్యక్తులపై నెటిజన్లు మండిపడుతున్నారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వీడియో వైరల్గా మారిన నేపథ్యంలో ఘటన పోలీసుల దృష్టికి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులపై ‘జంతువులపై క్రూరత్వం నివారణ’ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకొని కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2MBlty3
0 Comments