జిల్లాలో అత్యంత విషాద ఘటన చోటుచేసుకుంది. మరికొద్దిగంటల్లో పెళ్లి పీటలెక్కాల్సిన యువకుడు పాడెనెక్కిన ఘటన వెలుగుచూసింది. జి.మాడుగుల మండలం గెమ్మెలి పంచాయతీ పరిధిలోని మద్దులబంద గ్రామానికి చెందిన జగన్నాథందొర(22)కి అదే సమీపంలోని సాడే గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయించారు. లాక్డౌన్ అమల్లో ఉన్నప్పటికీ కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి జరిపించేందుకు సిద్ధమయ్యారు. మంగళవారం వివాహం జరగాల్సి ఉంది. ఇరుకుటుంబాలు పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమైన సమయంలో ఊహించని విధంగా మృత్యువు ముంచుకొచ్చింది. సడెన్గా వరుడి ఇంటికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఏమైందో తెలియక విద్యుత్ స్తంభంపై సర్వీస్ వైర్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేసేందుకు వరుడు సిద్ధమయ్యాడు. Also Read: విద్యుత్ స్తంభం పైకెక్కి వైర్ చెక్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా తగలడంతో అక్కడి నుంచి కిందపడిపోయాడు. తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలో పడిపోయిన వరుడిని బైక్ అంబులెన్స్లో మాడుగుల ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. వరుడి మరణంతో ఇరుకుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. Read Also:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2zes6Dg
0 Comments