హైదరాబాద్ వస్తున్న ప్రైవేటు బస్సు బోల్తా.. లోపల 50 మంది ప్రయాణికులు

ఒడిశా నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఓ ప్రైవేటు బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ఒడిశాలోని కలహండి జిల్లా ధారమ్‌గఢ్ నుంచి హైదరాబాద్‌ వస్తున్న ప్రైవేటు బస్సు బోల్తా పడింది. కలహండి జిల్లాలోని కోక్‌సర పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బొడోకెందుగుడ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగే సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో 40 మందికి గాయాలవగా.. వారిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో సహాయ కార్యక్రమాలు అందించారు. క్షతగాత్రులను సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే, భారీ మలుపును డ్రైవర్‌ గుర్తించలేకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా, ఒడిశాలోని ధారమ్‌గఢ్ నుంచి హైదరాబాద్ 700 కిలో మీటర్లకు పైగా ఉంటుంది. ధారమ్‌గఢ్ నుంచి బస్సు బయలు దేరిన కాసేపటికే దాదాపు 40 కిలో మీటర్ల దూరంలో ఉన్న కోక్‌సర వద్ద ఈ ప్రమాదం జరిగింది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3qOd9xX

Post a Comment

0 Comments