హైవేల దిగ్బంధం, బీజేపీ నేతల ఘొరావ్.. తగ్గేది లేదంటున్న రైతులు

వ్యవసాయ చ‌ట్టాల‌పై రైతులు త‌మ ఆందోళ‌న‌ను మ‌రింత ఉధృతం చేశారు. చట్టాలను రద్దు చేసే ప్రసక్తే లేదని హోం మంత్రి అమిత్ షా తేల్చి చెప్పడంతో తదుపరి కార్యాచరణ ప్రకటించారు. ఆందోళ‌న విర‌మించేందుకు ఒప్పుకుంటే ప్రస్తుత చ‌ట్టాల్లో 8 స‌వ‌ర‌ణ‌లు చేస్తామంటూ కేంద్రం చేసిన ప్రతిపాద‌న‌ల‌ను అన్నదాతలు తిర‌స్కరించారు. ఢిల్లీ శివార్లలో ఆందోళన నిర్వహిస్తున్న ప్రాంతంలో రైతు సంఘాల ప్రతినిధులు బుధవారం (డిసెంబర్ 9) సాయంత్రం సమావేశమై చర్చించారు. తమ పోరాటాన్ని తీవ్రం చేసే దిశ‌గా పలు నిర్ణయాలు తీసుకున్నారు. టోల్ ప్లాజాల వద్ద బైఠాయించి దేశ రాజధాని ఢిల్లీకి దారి తీసే రహదారులన్నింటినీ దిగ్భందం చేస్తామని రైతులు హెచ్చరించారు. బీజేపీ నేతల ఇళ్లు ముట్టడిస్తామని తెలిపారు. ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా డిసెంబర్ 12న ఢిల్లీ-జైపూర్‌, ఢిల్లీ-ఆగ్రా ర‌హ‌దారుల‌ను దిగ్బంధించాల‌ని రైతు సంఘాల నేత‌లు పిలుపునిచ్చారు. బీజేపీ నాయకులను ఘొరావ్ చేస్తామని తెలిపారు. డిసెంబర్ 14న దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టనున్నట్లు చెప్పారు. ర‌హ‌దారుల దిగ్బంధనం కోసం దేశంలోని వివిధ ప్రాంతాల రైతులు ఢిల్లీకి త‌ర‌లి రావాల‌ని రైతు సంఘాల నేత‌లు పిలునిచ్చారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్నదే తమ ప్రధాన డిమాండ్‌ అని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు. ఆ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని ప్రకటించారు. చట్టాల విషయంలో కేంద్రం వెనక్కి తగ్గని నేపథ్యంలో ఆందోళనలు మరింత ఉధృతం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. Must Read: Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2JMzye4

Post a Comment

0 Comments