బిట్స్ పిలానీలో మిస్టరీ మరణం.. కలకలం

బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్(బిట్స్)లో అనుమానాస్పద మరణం చోటుచేసుకుంది. బిట్స్ డిప్యూటీ రిజిస్ట్రార్ ఆర్‌సీ డాగర్ అనూహ్యంగా శవమై కనిపించారు. రాజస్థాన్‌లోని జుంజు జిల్లాలోని క్యాంపస్‌లోని తన నివాసంలో ఉంటున్నారు. హర్యానాకి చెందిన డాగర్ కొద్దికాలం నుంచి యాక్టింగ్ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన నివాసంలో శవమై కనిపించడం మిస్టరీగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే క్యాంపస్‌కి చేరుకుని ఆయన మృ తదేహాన్ని పరిశీలించారు. డాగర్ ఆత్మహత్య చేసుకున్నారా? లేక హత్య చేశారా? అనే కోణాల్లో ఆరా తీస్తున్నారు. కొద్దికాలం నుంచి పనిభారం ఎక్కువవడంతో ఒత్తిడికి గురయ్యాడని.. డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని ఆయన సోదరి చెప్పినట్లు తెలుస్తోంది. డాగర్ సూసైడ్ చేసుకుని ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మరణంపై స్పష్టత వచ్చే అవకాశముంది. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2W2dpv5

Post a Comment

0 Comments