పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. అతని ఫిర్యాదు తీసుకునేందుకు పోలీసులు నిరాకరించారు. అంతటితో ఆగకుండా బెదిరింపులకు దిగి తనపైనే అక్రమ కేసు నమోదు చేశారంటూ బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. సీరియస్గా పరిగణించిన న్యాయస్థానం ఎస్సైకి షాకిచ్చింది. అతనిపై.. అదే స్టేషన్లో కేసు నమోదు చేయాలంటూ సంచలన ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎస్సైపై కేసు నమోదైంది. ఈ ఘటన జిల్లా రఘునాథపల్లిలో జరిగింది. రఘునాథపల్లి ఎస్సై తనపై అక్రమ కేసు బనాయించారంటూ కంచనపల్లి గ్రామానికి చెందిన రామ్మూర్తి న్యాయస్థానాన్ని, మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఫిర్యాదును తిరస్కరించడమే కాకుండా బెదిరింపులకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. తనపై అక్రమ కేసు పెట్టారని కోర్టుకు తెలియజేశారు. సీరియస్గా పరిగణించిన న్యాయస్థానం రఘునాథపల్లి ఎస్సైపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎస్సై అశోక్ సహా మరో 11 మందిపై అదే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం గమనార్హం. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2W6QCOy
0 Comments