కొత్తగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన నూతన వధువు మనసు తెలుసుకుని మసలుకోవాల్సిన భర్త.. పెళ్లైన నాలుగు రోజులకే పేచీ పెట్టడం ఆమెను కుంగదీసింది. శోభన రాత్రి తనకు సహకరించడం లేదంటూ అందరికీ చెప్పడంతో ఆత్మన్యూనతకు గురై అఘాయిత్యానికి ఒడిగట్టింది. కనీసం అర్థం చేసుకోకుండా కుటుంబ సభ్యులు కూడా ఆమెని ప్రశ్నించడంతో సిగ్గుతో ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ అత్యంత విషాదకర ఘటన నగరంలో చోటుచేసుకుంది. కాట్రేనికోన మండలం బొట్టుచెరువుకి చెందిన శ్రీనివాస్(పేరు మార్చాం) బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చి జగద్గిరిగుట్ట పరిధిలోని ప్రగతి నగర్లో నివాసముంటున్నాడు. శ్రీనివాస్ మేస్త్రీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటీవల తన పెద్ద కుమార్తె శైలజ(24) (పేరు మార్చాం)కి ఈ నెల 6వ తేదీన స్వగ్రామంలో పెద్దల సమక్షంలో వివాహం జరిపించారు. వివాహానంతరం సంప్రదాయం ప్రకారం ఈ నెల 9న శోభనం ఏర్పాటు చేశారు. అదే నవవధువుకి చేదు అనుభవం మిగిల్చింది. నూతనంగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన యువతి మనసు తెలుసుకోకుండా తనకు సహకరించడం లేదంటూ వరుడు పేచీపెట్టాడు. పెద్దల ముందు పంచాయితీ పెట్టాడు. ఆ విషయం అందరికీ తెలిసిపోవడంతో ఆమె ఆత్మన్యూనతకు గురైంది. కుటుంబ సభ్యులు కూడా ఆమెనే ప్రశ్నించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన నవవధువు నాలుగురోజులు తిరక్కుండానే ఆత్మహత్యాయత్నం చేసింది. Also Read: ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు, బంధువులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. శోభనం రాత్రి జరిగిన గొడవ కారణంగానే తమ కూతురు ఆత్మహత్యాయత్నం చేసిందని వధువు తల్లిదండ్రులు జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటనతో పెళ్లింట విషాదం నెలకొంది. రెండు కుటుంబాల్లో కలకలం రేగింది. Read Also:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3oIIMHi
0 Comments