కూతురులా చూసుకోవాల్సిన కోడలితోనే ఓ వ్యక్తి సంబంధం పెట్టుకున్నాడు. భార్య, పెద్ద కోడలు ఆగ్రహానికి గురయ్యాడు. ఎంత నచ్చజెప్పినా తన ప్రవర్తన మార్చుకోకపోవడంతో వారిద్దరూ కలిసి అతడిని దారుణంగా హత్య చేశారు. ఉత్తర్ ప్రదేశ్లోని భాదోయి జిల్లాలో కోయిరానా పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 55 ఏళ్ల ఓ వ్యక్తికి నలుగురు కొడుకులు ఉన్నారు. కూలీలుగా పనిచేస్తున్న ఈ నలుగురు ముంబైకి వలస వెళ్లారు. వీరిలో ఇద్దరి కుమారులకు వివాహమైంది. ఆ ఇద్దరు కోడళ్లు అత్తామామలతో పాటే ఇంటి వద్ద ఉంటున్నారు. ఇంటి పెద్ద అయిన 55 ఏళ్ల ఆ వ్యక్తి.. కుమారుడు దూరంగా ఉన్న పరిస్థితిని అనుకూలంగా మార్చుకొని తన చిన్న కోడలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఒక రోజు అతడి భార్య, పెద్ద కోడలుకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబట్టారు. దీంతో వారిద్దరూ అతడితో ఘర్షణ పడ్డారు. ఎంత నచ్చజెప్పినా వారిద్దరూ తమ ప్రవర్తన మార్చుకోకపోవడంతో నిందితుడి పెద్ద కోడలు, భార్య కలిసి చిన్న కోడలిని కొద్ది రోజుల కిందట పుట్టింటికి పంపించేశారు. ఈ పరిణామంతో అతడు కోపంతో రగిలిపోయాడు. ఓ రోజు పెద్ద కోడలి మీద దాడి చేసి గాయపడిచాడు. ఆమె కన్నుకు తీవ్ర గాయమైంది. అనంతరం భార్య, పెద్ద కోడలును ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడు. అదే కాలనీలో తమ నివాసానికి కొద్ది దూరంలో ఉన్న మరో ఇంట్లో వారిద్దరూ ఉంటున్నారు. నాలుగు రోజుల కిందట నిందితుడు తన చిన్న కోడలిని తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు. పెద్ద కోడలు, అత్తకు ఈ విషయం తెలియడంతో వాళ్లకు కోపం కట్టలు తెంచుకుంది. అతడిని ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకొని ఇంటికి వెళ్లారు. శనివారం (డిసెంబర్ 12) రాత్రి కోడలితో ఏకాంతంగా గడుపుతున్న మామపై దాడి చేశారు. కత్తితో అతడి గొంతు కోసేశారు. ఆ హఠాత్పరిణామానికి షాక్కు గురైన చిన్న కోడలు అక్కడ నుంచి పారిపోయి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులకు దాడి విషయం గురించి చెప్పింది. పోలీసులు ఘటానస్థలికి చేరుకునే సరికి నిందితుడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే అతడిని స్థానిక హాస్పిటల్కు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు భాదోయి ఎస్పీ రామ్ బదన్ సింగ్ తెలిపారు. Also Read: Must Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2LxpnKZ
0 Comments