Chit Fund: బిచాణా ఎత్తేసిన లేడీ బాస్.. ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!!

చిట్టీల పేరుతో ఘరానా మోసం వెలుగుచూసింది. వందల మంది నుంచి భారీగా డబ్బులు వసూలు చేసిన లేడీ కస్టమర్లకు షాకిచ్చింది. ఒక్కసారిగా బిచాణా ఎత్తేసింది. కోట్ల రూపాయలతో చెక్కేసింది. దిక్కుతోచని బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన హైదరాబాద్‌‌లో జరిగింది. చాంద్రాయగుట్ట పరిధిలోని పటేల్ నగర్‌కి చెందిన అంజలి చిట్టీల వ్యాపారం నిర్వహించేది. ఎంతోమందిని నమ్మించి భారీగా డబ్బులు వసూలు చేసింది. చిట్టీల పేరుతో కోట్ల రూపాయలు తీసుకున్న అంజలి.. ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. డబ్బులు తిరిగివ్వకుండా అందరినీ నట్టేట ముంచి ఉడాయించింది. సుమారు వంద మంది కస్టమర్ల నుంచి పది కోట్ల రూపాయలకు పైగానే వసూలు చేసినట్లు తెలుస్తోంది. మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటూ చాంద్రయణ గుట్ట పోలీసులను ఆశ్రయించారు. అక్కడి పోలీసులు ఈ కేసును సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌కు బదిలీ చేశారు. బాధితులు సీసీస్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అంజలి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3aeiusz

Post a Comment

0 Comments