మాజీ ప్రియుడి కిరాతకం.. పెళ్లయిన నాలుగోరోజే వధువు హత్య

పెళ్లైన 4 రోజులకే నవవధువు దారుణ హత్యకు గురైంది. అత్తింటి నుంచి పుట్టింటికి వెళ్తుండగా మాటువేసిన మాజీ ప్రియుడు ఆమెను తుపాకీతో కాల్చి చంపేశాడు. అనంతరం తాను కూడా కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన బీహార్‌లోని నలందా జిల్లాలో చోటుచేసుకుంది. భగాన్‌ బిఘా పోలీసు స్టేషన్ పరిధిలోని కెవైది ప్రాంతానికి చెందిన సందీప్ కుమార్ కూతురు షబ్నం కుమారికి షాపూర్‌కు చెందిన వికాస్ కుమార్‌తో మే 26వ తేదీన వివాహం జరిగింది. అయితే షబ్నంకు పెళ్లికి ముందే రాజ్‌పాల్ పాశ్వాన్ అలియాస్ రేహాన్ అనే యువకుడితో ప్రేమ వ్యవహారం నడిచింది. అతడి ప్రవర్తన నచ్చని షబ్నం బ్రేకప్ చెప్పేసి పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంది. అయితే పెళ్లయిన నాలుగో రోజు ఆదివారం షబ్నం భర్తతో కలిసి బైక్‌పై తన పుట్టింటికి బయలుదేరింది. వారిని వెంబడించిన రాజ్‌పాల్ మార్గమధ్యలో అడ్డుకుని తనతో రావాలని షబ్నంను ఒత్తిడి చేశాడు. ఆమె తిరస్కరించడంతో రాజ్‌పాల్ ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో వెంట తెచ్చుకున్న తుపాకీతో షబ్నంను తుపాకీతో విచక్షణా రహితంగా కాల్చేశాడు. అనంతరం తాను కూడా కాల్చుకున్నాడు. స్థానికులు వీరిద్దరిని పాట్నాలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2RSHnTQ

Post a Comment

0 Comments