White Fungus కలకలం.. బ్లాక్ ఫంగస్‌ కంటే డేంజర్.!

కరోనా సెకండ్ వేవ్ ఉధృతితో దేశంలో కరోనా కేసులు లక్షల్లో నమోదవుతున్నాయి. ఎలాగో కరోనా నుంచి కోలుకున్నా బాధితులకు రూపంలో మరో ముప్పు వచ్చిపడింది. కరోనా నుంచి కోలుకున్న వారికి బ్లాక్ ఫంగస్ సోకడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర, రాజస్థాన్, ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా బిహార్‌లో కేసులు నమోదు కావడం తీవ్ర కలకలం రేపుతోంది. బ్లాక్ ఫంగస్ కంటే వైట్ ఫంగస్ చాలా ప్రమాదకరమని వైద్యనిపుణులు చెబుతున్నారు. కరోనా లక్షణాలతో వచ్చిన రోగులకు టెస్ట్ చేయగా కరోనా నెగటివ్‌గా నిర్ధారణ అయింది. అనుమానంతో మరికొన్ని వైద్య పరీక్షలు నిర్వహించడంతో వైట్ ఫంగస్‌ వచ్చినట్లు తేలిందని పట్నా మెడికల్ కాలేజీ ఆసుపత్రి, మైక్రోబయాలజీ డిపార్ట్‌మెంట్ హెడ్ డాక్టర్ ఎస్‌ఎస్ సింగ్ తెలిపారు. నలుగురికి వైట్ ఫంగస్ సోకినట్లు నిర్ధారణ అయిందని.. అలాంటి కేసులు మరికొన్ని ఉండొచ్చని ఆయన అన్నారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే షుగర్ పేషెంట్లు, ఎయిడ్స్, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నవారు ఈ వ్యాధికి గురయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. వైట్ ఫంగస్ ఊపిరితిత్తులతో పాటు ఇతర ప్రధాన అవయవాలపై కూడా ప్రభావం చూపుతుందని డాక్టర్ సింగ్ చెప్పారు. సాధారణ కోవిడ్ లక్షణాలే ఉంటాయని.. ఎక్స్‌రే, సీటీ స్కాన్ ద్వారా వైట్ ఫంగస్‌ను గుర్తించవచ్చని ఆయన అన్నారు. కోవిడ్ రోగులకు ఆక్సిజన్ అందించే సమయంలో నిర్లక్ష్యం కారణంగా వైట్ ఫంగస్ సోకే అవకాశముందన్నారు. ఆక్సిజన్ తయారీలో కుళాయి నీరు వాడుతున్నారని.. అందులో వైట్ ఫంగస్ ఉంటే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుందని సింగ్ చెప్పారు. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3woFbSj

Post a Comment

0 Comments