విడాకులు తీసుకోకుండా మరొకరితో సహజీవనం.. పంజాబ్ హైకోర్టు సంచలన తీర్పు

సహజీవనం చేస్తున్న జంటకు భద్రత కల్పించాలని సంచలన తీర్పును వెలువరించింది. వివాహమై విడాకుల కోసం దరఖాస్తు చేసిన పరమ్‌జీత్ కౌర్ అనే వ్యక్తి.. మరో మహిళతో సహజీవనంలో ఉన్నాడు. విడాకులు మంజూరుకాకుండానే మరో మహిళతో సహజీవనం చేయడం పట్ల అతడి భార్య, ఆమె తరఫు కుటుంబసభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అతడిపై బెదిరింపులకు పాల్పడటంతో తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఈ జంట పంజాబ్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ అమోల్ రత్తన్ సింగ్.. బాధితులకు రక్షణ కల్పించాలని ఆదేశాలు జారీచేసింది. ఈ సందర్భంగా 2018లో ఐపీసీ సెక్షన్ 497 (వ్యభిచారం)ను రద్దుచేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉదహరించారు. పిటిష‌న‌ర్ త‌ర‌పున న్యాయ‌వాది దినేష్ మ‌హ‌రాజ‌న్ వాదనలు వినిపిస్తూ.. తమ క్ల‌యింట్‌కు ఇప్ప‌టికే వివాహం కాగా విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాడని తెలిపారు. విడాకులు కూడా దాదాపు ఖ‌రారయ్యాయ‌ని.. దీంతో ప్ర‌స్తుతం త‌న‌కు నచ్చిన మ‌రో యువ‌తితో రిలేషన్ షిప్‌లో ఉన్నాడ‌ని వివరించారు. ఇటీవల అనిత.. స్టేట్ ఆఫ్ యూపీ కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో న్యాయమూర్తి ఏకీభవించలేదు. విడాకులు తీసుకోకుండా మరో వ్యక్తితో సహజీవనం చేస్తున్న యువతి.. తనకు రక్షణ కల్పించాలని కోరగా.. అలహాబాద్ హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. ప్రస్తుత కేసులో సహజీవనంలో పిటిషనర్లు ఎలాంటి నేరం చేసినట్లు కనిపించడం లేదని, విడాకుల పిటిషన్ పెండింగ్‌లో ఉందో? లేదో? అనవసరమని జస్టిస్ సింగ్ వ్యాఖ్యానించారు. పిటిషనర్ల జీవితం, స్వేచ్ఛకు రక్షణ కల్పించాలని ఖన్నా జిల్లా సీనియర్ ఎస్పీని కోర్టు ఆదేశించింది. అంతేకాదు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ ద్వారా మళ్లీ వేధింపులకు గురిచేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని న్యాయమూర్తి హెచ్చరించారు. అనంతరం విచారణకు సెప్టెంబరు 24కు వాయిదా వేశారు. అయితే, కొద్దివారాల కిందటే మరో వ్యక్తితో సహజీవనం చేస్తున్న ఓ వివాహిత తనకు రక్షణ కల్పించాలని ఇదే కోర్టును ఆశ్రయించగా.. అందుకు నిరాకరించడం గమనార్హం. రాజస్థాన్ హైకోర్టు సైతం ఓ కేసులో ఈ విధంగానే స్పందించింది.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/3nhF3CU

Post a Comment

0 Comments