పెద్ద సంఖ్యలో మ్యుటేషన్లు చూసి షాక్ తిన్నా.. తొలిసారి ఒమిక్రాన్‌ను గుర్తించిన మహిళా శాస్త్రవేత్త

కరోనా మహమ్మారి నుంచి క్రమంగా కోలుకుని, ఇప్పుడిప్పుడే గాడినపడుతున్నామని ఊపిరి పీల్చుకుంటున్న ప్రపంచానికి.. రూపంలో మరో ముప్పు ముంచుకొచ్చింది. దక్షిణాఫ్రికాలో తొలిసారిగా వెలుగుచూసిన మునుపటి కంటే అత్యంత వేగంగా వ్యాప్తిచెందుతున్నట్టు ప్రాథమిక ఆధారాలు వెల్లడిస్తున్నాయి. అయితే, ఈ వేరియంట్‌ను తొలిసారిగా గుర్తించినప్పుడు తాను ఆందోళనకు గురయ్యానని దక్షిణాఫ్రికాకు చెందిన వైద్యురాలు వెల్లడించారు. వేరియంట్ గుర్తించడానికి ముందు ఏం జరిగిందనేది దక్షిణాఫ్రికాలోని అతిపెద్ద ప్రైవేట్ టెస్టింగ్ ల్యాబ్‌లలో ఒకటైన సైన్స్ హెడ్‌కు చెందిన పరిశోధకురాలు వెల్లడించారు. కరోనా బారినపడ్డ ఎనిమిది మంది నమూనాలకు జన్యు పరీక్షలు నిర్వహిస్తుండగా.. ఫలితాలను తనను షాక్‌కు గురి చేశాయన్నారు. లాన్సెట్ ల్యాబొరేటరీలో పరీక్షించి నమూనాల్లో పెద్ద సంఖ్యలో ఉత్పరివర్తనాలు ముఖ్యంగా మానవ కణాల్లోకి ప్రవేశించడానికి ఉపయోగించే స్పైక్ ప్రొటీన్‌లో ఇవి ఉన్నాయని తెలిపారు. ‘అందులోని మ్యుటేషన్లు చూసి షాక్ తిన్నా.. వెంటనే ఏదో తేడా జరుగుతోందని నాకు నేను ప్రశ్నించుకున్నాను.. శాంపిల్స్‌లో భారీ మార్పులు చోటుచేసుకుంటాయన్న భావన కలిగింది’ అన్నారు. తక్షణమే జోహన్స్‌బర్గ్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్ఐసీడీ)లోని నా సహోద్యోగి అమోకాకి ఫోన్‌ చేసి ఈ విషయాన్ని పంచుకున్నాను. ‘వాటిని ఎలా విచ్ఛిన్నం చేయాలో నాకు తెలియదు.. ఇది కొత్త వర్గంటా కనిపిస్తోంది’ అని భయపడ్డానని తెలిపారు. వియానా పంపిన నమూనాలను ఎన్ఐసీడీలోని అమోకా, ఆమె బృందం నవంబరు 20,21 తేదీల్లో పరీక్షించి కొత్త వేరియంట్‌గా నిర్ధారించారు. వియానా పరీక్షలు నిర్వహించినప్పుడు వచ్చిన ఫలితాలే పునరావృతం కావడంతో ఆందోళనకు గురయ్యారు. అంతకు ముందు వారం నుంచి దేశంలో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతుండటంతో ఆ దిశగా పరీక్షలు చేపట్టారు. ఈ కేసులకు, వేరియంట్‌‌కు సంబంధం ఉన్నట్టు నిర్ధారించుకున్నారు. అంతేకాదు, ఆర్టీ-పీసీఆర్ పరీక్షల్లో S-జన్యువు మిస్సయినట్టు తేలిందని వియానా పేర్కొన్నారు. దీంతో ఇది బి.1.1.529గా నిర్ధారించామని తెలియజేశారు.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/3peM4nA

Post a Comment

0 Comments