Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Sunday, 28 July 2019

యువతిని ఎత్తకెళ్లి రేప్.. చనిపోయిందనుకుని గొయ్యితీసి పాతేశాడు

ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై కన్నేసిన కామాంధుడు ఆమెను బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన బాధితురాలు చనిపోయిందనుకుని గొయ్యి తీసి పాతిపెట్టి వెళ్లిపోయాడు. అయితే కాసేపటి తర్వాత మెలకువ వచ్చిన బాధితురాలు మట్టి తొలగించుకుని వచ్చి తల్లిదండ్రులకు జరిగిన దారుణాన్ని చెప్పి బోరుమంది. సినిమా సన్నివేశాన్ని తలపించేలా సాగిన ఈ దారుణ ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. మండలం పెదనిండ్రకొలను గ్రామంలో 20ఏళ్ల యువతి తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. అదే గ్రామానికి చెందిన కడగళ్ల రాజేష్ అనే యువకుడు ఆ యువతిని లైంగికంగా వేధిస్తున్నాడు. గురువారం రాత్రి తల్లిదండ్రులు బయటకు వెళ్లడంతో ఆ యువతి ఇంట్లో ఒంటరిగా ఉంది. ఈ విషయం తెలుసుకున్న రాజేశ్‌ ఆమెపై దాడి చేసి నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లాడు. అక్కడ తీవ్రంగా కొట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు స్పృహతప్పి పడిపోవడంతో చనిపోయిందనుకుని అక్కడే గొయ్యితీసి పాతేశాడు. కొంతసేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన బాధితురాలు మట్టి తొలగించుకుని ఇంటికి చేరుకుని జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. ఈ విషయం తెలిస్తే పరువు పోతుందని భావించిన ఆమె పేరెంట్స్ గుట్టుగా ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. ఈ ఘటన గురించి బంధువులకు తెలియడంతో రాజేష్ లాంటి నీచుడిని వదలకూడదని, కేసు పెట్టాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో బాధితురాలు ఆదివారం తండ్రితో కలిసి నిడమర్రు పోలీసులకు ఫిర్యాదు చేసింది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2YsBVnA

No comments:

Post a Comment