Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Monday, 29 July 2019

సంస్థ ఉద్యోగులకు కాఫీ కింగ్ చివరి లేఖ.. అందులో ఏం రాశారంటే?

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి అల్లుడు, కేఫ్‌ కాఫీ డే అధినేత మిస్సింగ్ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. సోమవారం సాయంత్రం మంగళూరులోని నేత్రావతి నది వంతెనపై తన వాహనం దిగి నడుచుకుంటూ వెళ్లిన సిద్ధార్థ ఆ తర్వాత కన్పించకుండా పోయారు. దీంతో ఆయన ఎక్కడున్నారు, ఎమయ్యారనేది చిక్కుముడిగా మారింది. ఇంకోవైపు సిద్ధార్థ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తుండగా, ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఇది జరగడానికి ముందు సిద్ధార్థ తన సంస్థ ఉద్యోగులు, బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లకు ఓ లేఖ రాశారు. సిద్ధార్థ రాసిన ఈ లేఖ మీడియాలో ప్రచారమవుతోంది. వ్యాపారంలో నష్టాలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా సిద్ధార్థ అదృశ్యమైనట్టు లేఖ ద్వారా స్పష్టమవుతోంది. ‘నాపై నమ్మకం పెట్టుకున్న ప్రతి ఒక్కరికీ క్షమాపణ చెప్పుకుంటున్నాను.. నేను వ్యాపారవేత్తగా విఫలమయ్యాను.. 37ఏళ్ల నా కృషితో ప్రత్యక్షంగా 30వేల మందికి, పరోక్షంగా 20వేల మందికి ఉపాధి కల్పించాను. ప్రస్తుతం మంచి ప్రయత్నాలు చేస్తున్నా, వ్యాపారాన్ని లాభసాటిగా సృష్టించడంలో విఫలమవుతున్నాను. దీనిపై సుదీర్ఘకాలం నుంచి పోరాటం చేస్తున్నా ఇక నాకు పోరాడే ఓపిక లేదు.. అందుకే అన్ని వదిలేస్తున్నా. ఆరు మాసాల కిందట ఓ స్నేహితుడి నుంచి పెద్ద మొత్తంలో రుణం తీసుకున్నాను.. ఓ ప్రయివేటు ఈక్విటీలోని భాగస్వాములు షేర్లను బైబ్యాక్‌ చేయమని నన్ను బలవంతపెడుతున్నారు. ఆదాయపు పన్ను గత డీజీ నుంచి ఎన్నో వేధింపులకు ఎదుర్కొన్నాను. రుణాలు తీసుకున్నవారి నుంచి ఒత్తిడి కూడా ఎక్కువైంది.. నాపై మీరంతా ఎంతో నమ్మకం ఉంచారు, దాన్ని వమ్ము చేస్తున్నందుకు క్షమించండి. కొత్త యాజమాన్యంతో మీరంతా మద్దతుగా ఈ వ్యాపారాని ఇలాగే కొనసాగించాలని కోరుతున్నా. నా తప్పులన్నింటికీ నాదే బాధ్యత. నా లావాదేవీల గురించి మా మేనేజ్‌మెంట్‌కు, ఆడిటర్లకు తెలియదు. వాటికి నేనే జవాబుదారిని. నేను ఎవర్నీ మోసం చేయాలనుకోలేదు. నేను విఫల వ్యాపారవేత్తను. నన్ను క్షమించండి’ అని సిద్ధార్థ ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా, సిద్ధార్థ ఆచూకీ కోసం 200 మందికి పైగా పోలీసులు గాలిస్తున్నారు. నేత్రావతి నదిని గజ ఈతగాళ్ల సాయంతో జల్లెడ పడుతున్నారు. ఇక, మాజీ ముఖ్యమంత్రి ఎస్‌.ఎం. కృష్ణ గత ఎన్నికల ముందే బీజేపీలో చేరారు. ఆయన అల్లుడు సిద్ధార్థ మిస్సింగ్ వార్త తెలియగానే ముఖ్యమంత్రి యడియూరప్ప, కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌, పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కృష్ణ నివాసానికి చేరుకున్నారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2Zld6LA

No comments:

Post a Comment