Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Monday, 29 July 2019

కరకట్టపై నిర్మాణాలకు సీఆర్డీఏ నోటీసులు.. హైకోర్టు కీలక ఆదేశాలు

నదీ పరిరక్షణ చట్టాలను ఉల్లంఘించిన కృష్ణానది కరకట్టపై నిర్మాణాలు చేపట్టారని పేర్కొంటూ పలువురికి సీఆర్‌డీఏ అధికారులు నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నిర్మించిన ప్రజావేదికను సైతం కూల్చివేశారు. ఈ నేపథ్యంలో సీఆర్‌డీఏ అధికారులు జారీచేసిన నోటీసులను సవాల్ చేస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. సీఆర్‌డీఏ నోటీసులపై చందన కేదారిష్‌ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి ప్రవీణ‌్‌కుమార్, జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తి ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. కక్షిదారుడు లేవనెత్తిన అభ్యంతరాలన్నింటినీ అధికారులు పరిగణనలోకి తీసుకోవాలని ధర్మాసనం స్పష్టంచేసింది. ఆ తర్వాతే భవనం విషయంలో తుది ఉత్తర్వులు జారీచేయాలని పేర్కొంది. అప్పటివరకూ యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశాలు జారీచేసింది. కృష్ణానదికి 100 మీటర్లలోపు భవన నిర్మాణాలకు తావులేదని, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాన్ని ఎందుకు తొలగించకూడదో వివరణ ఇవ్వాలని కేదారిష్‌కు జారీచేసిన నోటీసుల్లో సీఆర్‌డీఏ అధికారులు పేర్కొన్నారు. దీన్ని సవాల్ చేస్తూ కేదారిష్‌ పిటిషన్ దాఖలు చేశారు. తొలుత ఆ నోటీసు అమలును మూడు వారాలు నిలుపుదల చేయాలని సింగిల్‌ జడ్జి స్టే ఇచ్చారు. దీనిని సవాలు చేస్తూ సీఆర్‌డీఏ కమిషనర్‌ అప్పీల్ చేశారు. మరోవైపు, జారీచేసిన నోటీసుల్లో బీజేపీ నేత, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు గెస్ట్‌హౌస్ కూడా ఉంది. ఈ నోటీసులను సవాల్ చేస్తూ గోకరాజు సైతం హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టిన హైకోర్టు కరకట్టపై నిర్మించిన భవనాల తొలగింపు విషయమై జారీచేసిన నోటీసులపై అఫిడ్‌విట్ దాఖలు చేయాలని సీఆర్‌డీఏ అధికారులను ఆదేశించింది. కాగా, కొత్త ప్రభుత్వ ఆదేశాలతో అక్రమ కట్టడాలకు అధికారులు నోటీసులు ఇస్తున్నారు. కరకట్ట వెంబడి 100 మీటర్లలోపు 50 అక్రమ కట్టడాలు గుర్తించిన అధికారులు వారికి త్వరలోనే నోటీసులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు హయాంలో కరకట్ట వద్ద నిర్మించిన ప్రజావేదికను కూల్చివేయగా, దీనికి సమీపంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంటున్న లింగమనేని గెస్ట్‌హౌస్ సైతం నదీగర్భంలోనే నిర్మించారని, దీనిని బాబు తక్షణమే ఖాళీచేయాలంటూ వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2OtnyQv

No comments:

Post a Comment