Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Tuesday, 26 November 2019

మాకు చేతినిండా పని.. మార్చి వరకు 13 ప్రయోగాలు: ఇస్రో ఛైర్మన్ శివన్

చంద్రయాన్-2 తర్వాత తొలిసారి చేపట్టిన పీఎస్‌ఎల్వీ-సీ47 ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి పీఎస్‌ఎల్వీ ద్వారా 14 ఉపగ్రహాలను విజయవంతంగా నింగిలోకి పంపారు. ఇందులో దేశ భద్రతకు ఉపకరించే కార్టోశాట్-3 సహా అమెరికాకు చెందిన 13 నానో వాణిజ్య ఉపగ్రహాలు ఉన్నాయి. ప్రయోగం విజయవంతమైన తర్వాత శాస్త్రవేత్తలను ఇస్రో ఛైర్మన్ కే శివన్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్టోశాట్-3 ఉపగ్రహం వల్ల దేశ భద్రత మరింత పటిష్టమవుతుందని, సరిహద్దుల్లో నిఘాకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. భూవాతావరణం, విపత్తుల గురించి సమాచారం అందుతుందని అన్నారు. కార్టోశాట్-3లో మిగతా వాటి కంటే అత్యంత రిజల్యూషన్ వ్యవస్థ ఉందని పేర్కొన్నారు. వచ్చే మార్చి వరకు 13 ప్రయోగాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. తమ శాస్త్రవేత్తలకు చేతినిండా పని ఉందని, సందర్భానికి తగినట్టు సవాళ్లను ఎదుర్కొడానికి తాము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామని శివన్ వ్యాఖ్యానించారు. రిశాట్-2బీఆర్1, రిశాట్-2బీఆర్2లను పీఎస్‌ఎల్వీ-సీ48, సీ49 ద్వారా డిసెంబరులో నింగిలోకి పంపనున్నారు. ఈ ఏడాదిలో మే రిశాట్-2బీ, ఏప్రిల్ 1న ఎలక్ట్రానిక్స్ ఇంటెలిజెన్స్ శాటిలైట్ (ఎమిశాట్)ను ఇస్రో ప్రయోగించింది. ఈ ఉపగ్రహాలు శత్రు రాడార్ల కదలికలపై స్పష్టమైన సమాచారం చేరవేస్తాయి. ఈ ప్రయోగం జరిగిన ఆరు నెలల తర్వాత చంద్రయాన్ -2‌ను శ్రీహరికోట నుంచి ప్రయోగించారు. ఇస్రో చరిత్రలో తొలిసారిగా శ్రీహరికోట నుంచి ఒకే ఏడాది ప్రయోగించిన అన్ని ఉపగ్రహాలు సైనిక ప్రయోజనం కోసం ఉద్దేశించినవి కావడం విశేషం. రిశాట్2బీఆర్1‌తో పాటు జపాన్‌కు చెందిన క్యూపీఎస్-ఎస్ఏఆర్ మైక్రోశాటిలైట్‌, పీఎస్‌ఎల్వీ-సీ48 ద్వారా, రిశాట్-2బీఆర్2తోపాటు లగ్జెంబర్ సంస్థ క్లేయిస్ స్పేస్ అభివృద్ధి చేసిన నాలుగు ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నారు. వీటితోపాటు మరికొన్ని ప్రతిష్ఠాత్మక ప్రయోగాలను ఇస్రో నిర్వహించనుంది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2rxM1sw

No comments:

Post a Comment