Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Tuesday, 26 November 2019

పెళ్లి కోసం వేధిస్తోందని... ఇద్దరు బిడ్డల తల్లిని సజీవదహనం చేసిన ప్రియుడు

ఇద్దరు బిడ్డల తల్లితో కొనసాగించిన తర్వాత ఆమెను అడ్డు తొలగించుకునేందుకు సజీవ దహనం చేసిన వ్యక్తికి న్యాయస్థానం జీవితఖైదుతో పాటు రూ.2వేల జరిమానా విధించింది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడివాడకు చెందిన చల్లా శివప్రసాద్‌ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేసేవాడు. అదే పాఠశాలలో పనిచేసే నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలానికి చెందిన శ్రీదేవి(32)తో అతడికి పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారితీసింది. Also Read: శ్రీదేవికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ శివప్రసాద్‌తో సంబంధం కొనసాగిస్తూ తనను పెళ్లి చేసుకోవాలని వేధించేది. దీంతోపాటు అతడు సొంతంగా స్థాపించాలనుకున్న విద్యాసంస్థలో వాటా ఇవ్వాలని పట్టుబట్టేది. దీంతో ఆమెను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని శివప్రసాద్‌ నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే 2015 మార్చి 24న బోడుప్పల్‌లోని శ్రీదేవి ఇంటికి శివప్రసాద్ వచ్చాడు. ప్రియురాలితో కొంతసేపు ఏకాంతంగా గడిపిన తర్వాత కిరోసిన్ పోసి నిప్పుపెట్టి పరారయ్యాడు. Also Read: శరీరం మొత్తం కాలిపోవడంతో శ్రీదేవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీనిపై కేసు నమోదు చేసిన మేడిపల్లి పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేశారు. సాక్షాలన్నీ పరిశీలించిన సైబరాబాద్‌ అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ న్యాయమూర్తి శ్రీనివాస్‌ శివప్రసాద్‌ను దోషిగా నిర్ధారించారు. అతడికి జీవితఖైదుతో పాటు రూ.2వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2qFHch4

No comments:

Post a Comment