Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Tuesday, 25 February 2020

11ఏళ్ల బాలికపై బంధువు అత్యాచారం.. పశ్చిమగోదావరిలో దారుణ ఘటన

జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. 11ఏళ్ల బాలికపై సమీప బంధువే అత్యాచారానికి పాల్పడ్డాడు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన పేద దంపతులు కూలి పనులు చేస్తూ జీవిస్తున్నారు. వీరికి ఓ కూతురు ఉంది. రోజూ వారు పనులు పూర్తి చేసుకుని రాత్రివేళ ఇంటికొచ్చేవారు. బాలిక స్కూల్ ముగిసిన తర్వాత ఇంటికొచ్చి వారు తల్లిదండ్రులు వచ్చేవరకు ఒంటరిగానే ఉండేది. Also Read: ఈ విషయాన్ని గమనించిన బాలిక సమీప బంధువైన ఓ యువకుడు(30) ఆమెకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. నాలుగు రోజుల కిందట ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని నిందితుడు బెదిరించడంతో ఆమె తల్లిదండ్రులకు చెప్పలేదు. అయితే ఆ యువకుడు తరుచూ బాలికకు ఫోన్ చేయడాన్ని గమనించిన తండ్రి ఆరా తీయగా అత్యాచారం ఘటన వెలుగులోకి వచ్చింది. Also Read: దీంతో ఆయన ఉండ్రాజవరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను కొవ్వూరు డీఎస్పీ కె.రాజేశ్వరరెడ్డి మంగళవారం మీడియాకు వివరించారు. బాలికను వైద్య పరీక్షలకు పంపించామని, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2SX43Qq

No comments:

Post a Comment