
జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. 11ఏళ్ల బాలికపై సమీప బంధువే అత్యాచారానికి పాల్పడ్డాడు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన పేద దంపతులు కూలి పనులు చేస్తూ జీవిస్తున్నారు. వీరికి ఓ కూతురు ఉంది. రోజూ వారు పనులు పూర్తి చేసుకుని రాత్రివేళ ఇంటికొచ్చేవారు. బాలిక స్కూల్ ముగిసిన తర్వాత ఇంటికొచ్చి వారు తల్లిదండ్రులు వచ్చేవరకు ఒంటరిగానే ఉండేది. Also Read: ఈ విషయాన్ని గమనించిన బాలిక సమీప బంధువైన ఓ యువకుడు(30) ఆమెకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. నాలుగు రోజుల కిందట ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని నిందితుడు బెదిరించడంతో ఆమె తల్లిదండ్రులకు చెప్పలేదు. అయితే ఆ యువకుడు తరుచూ బాలికకు ఫోన్ చేయడాన్ని గమనించిన తండ్రి ఆరా తీయగా అత్యాచారం ఘటన వెలుగులోకి వచ్చింది. Also Read: దీంతో ఆయన ఉండ్రాజవరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను కొవ్వూరు డీఎస్పీ కె.రాజేశ్వరరెడ్డి మంగళవారం మీడియాకు వివరించారు. బాలికను వైద్య పరీక్షలకు పంపించామని, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2SX43Qq
No comments:
Post a Comment