Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Monday, 29 March 2021

పెళ్లి ఆశపెట్టి అమ్మాయి జంప్.. పోలీస్ స్టేషన్‌కెళ్తే దిమ్మదిరిగే షాక్!

యువకుడికి చాలా రోజులుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. వచ్చినట్టే వచ్చి అనేక సంబంధాలు తప్పిపోయాయి. లేకలేక ఓ పెళ్లి సంబంధం కుదిరింది. అమ్మాయి ఓకే చెప్పడంతో చకచకా ముహూర్తం పెట్టి పెళ్లికి ఏర్పాట్లు చేశారు. బంధువులు, స్నేహితులకు వెంటనే ఆ విషయాన్ని చెప్పుకున్నారు. ముహూర్త సమయానికి దగ్గరి బంధువులతో కలిసి కోలాహలంగా పంక్షన్ హాల్ వద్దకు చేరుకున్నారు. అక్కడ చూస్తే షాక్. పెళ్లికి సంబంధించిన కోలాహలమే లేదు. పైగా ఆ హాల్‌కు తాళం వేసి ఉంది. పెళ్లి మండపం మూసి ఉండటం చూసి నివ్వెరపోయిన వరుడి తల్లిదండ్రులు వెంటనే వధువు బంధువులకు కాల్ చేశారు. ఫోన్లు స్విచ్ఛాఫ్. చివరికి అమ్మాయి నంబర్‌కు కాల్ చేశారు. అది కూడా స్విచ్ఛాప్. చేసేదేంలేక పోలిసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లగా.. అక్కడ సీన్ చూసి పెళ్లికుమారుడికి, వారి తల్లిదండ్రులకు దిమ్మదిరిగిపోయింది. మధ్యప్రదేశ్‌లోని హార్దా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధిత యువకుడు జరిగిన విషయం గురించి చెప్పగానే పోలీసులు ‘నీ సీరియల్ నెంబర్ ఎంత?’ అని అడిగారు. ఆ ప్రశ్న విని ఆ పెళ్లికుమారుడు షాకయ్యాడు. అయోమయంగా మొఖం పెట్టడంతో మళ్లీ పోలీసులే కల్పించుకొని అసలు విషయం చెప్పారు. అక్కడే కూర్చొని ఉన్న మరో నలుగురు యువకులను చూపెట్టారు. వారంతా ఆ అమ్మాయి బాధితులేనని చెప్పడంతో నోరెళ్లబెట్టడం వరుడి వంతయ్యింది. ఒక అమ్మాయి చేతిలో ఓకే రోజు.. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఐదుగురు అబ్బాయిలు ఒకే రీతిలో మోసపోయారన్నమాట. మధ్య ప్రదేశ్‌లో ఇటీవల ఈ తరహా మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని సీఎస్పీ భూపేంద్ర సింగ్‌ తెలిపారు. ఓ మహిళ ఇద్దరు వ్యక్తులతో కలిసి ముఠాగా ఏర్పడి ఈ తరహా మోసాలకు పాల్పడుతోందట. పెళ్లి సంబంధాలు తప్పిపోతున్న యువకులను గుర్తించి, వారిని ఇలా చేస్తున్నారట. అబ్బాయిలకు పెళ్లి సంబంధం కుదరడం కష్టంగా ఉండే జిల్లాలను ఈ ముఠా ఎంచుకుంటుందని పోలీసులు తెలిపారు. ‘అక్కడ పెళ్లి సంబంధాలు కుదిర్చే వారికి వారి ఫోన్ నంబర్లు ఇస్తారు. వారి వద్ద నుంచి యువకుల ఫోన్‌ నంబర్లు తీసుకుంటారు. అమ్మాయిని చూపిస్తామని వారికి ఫోన్‌ చేస్తారు. భోపాల్‌కు రప్పించుకుంటారు. అక్కడ అమ్మాయిని పరిచయం చేస్తారు. ఆమె నచ్చిందని చెప్పగానే యువకుడి వద్ద నుంచి రూ.20,000 తీసుకుంటారు’ అని పోలీసులు తెలిపారు. అంటే ఐదుగురి దగ్గర కలిపి లక్ష రూపాయలు వెనకేసుకొని పారిపోయారన్నమాట. మొత్తానికి సెల్‌ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేశారు పోలీసులు. వారి మీద పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అబ్బాయిలు కాస్త వయసు ఎక్కువ వారైతే.. అమ్మాయి పేదింటి పిల్లని మాయమాటలు చెప్పి, పెళ్లికి ముందే అమ్మాయికి బంగారు గొలుసు కూడా పెట్టించుకున్నారట. ఈ తరహా మోసాలు ఎక్కువవుతున్నాయని ప్రజలను హెచ్చరిస్తున్నారు పోలీసులు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2QIpi9P

No comments:

Post a Comment