ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు.. ఆకట్టుకున్న శకటాలు

దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో 73వ గణతంత్ర వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, జెండాకు సెల్యూట్ చేశారు. తర్వాత త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం త్రివిధ దళాల మార్చ్ ఫాస్ట్, విన్యాసాలు, ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా రాష్ట్రాలవారీగా ప్రదర్శించిన శకటాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని ప్రత్యేకతలను ప్రతిబింబించేలా శకటాలను ప్రదర్శనలో పెట్టారు. మేఘాలయ రాష్ట్రానికి చెందిన శకటంపై మహిళలు వెదురు బుట్టలు అల్లుతున్నట్టుగా రూపొందించగా.. గుజరాత్ శకటం అక్కడి గిరిజనుల పోరాట పటిమను చాటి చెప్పేలా రూపొందించారు. ఇక గోవా శకటం అక్కడి వారసత్వ చరిత్రను చాటిచెప్పింది. హర్యాణా శకటాన్ని క్రీడాకారుల నమూనాతో రూపొందించారు. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర శకటంపై స్కిల్ డెవలప్‌మెంట్, ఉపాధి కల్పనకు సంబంధించిన నమూనాలను ప్రదర్శించారు. ఇవే కాక అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యాణా వంటి ఇతర రాష్ట్రాలు కూడా తమ శకటాలను ప్రదర్శించాయి. రాష్ట్రాలతో పాటు వివిధ కేంద్ర శాఖలు కూడా తమ శకటాలను ప్రదర్శించాయి. కేంద్ర విద్యాశాఖ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ విశిష్టితను తెలియజేసే రీతిలో ఓ శకటాన్ని రూపొందించింది. మహిళా సాధికారత గురించి తెలియజేస్తూ పోస్టల్ శాఖ కూడా ఓ శకటాన్ని ప్రదర్శించింది. పోస్ట్ వుమెన్ గురించి శకటంలో ప్రదర్శించారు. అలాగే ఆధ్యాత్మిక గురువు శ్రీ అరబిందో 150వ జయంతి సందర్భంగా ఆయన విశిష్టత అందరికి తెలిసేలా ఓ శకటాన్ని ప్రదర్శించారు.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/3KDRulX

Post a Comment

0 Comments