తెలుగు రాష్ట్రాల్లో చిరుత పులులు హల్చల్ చేస్తున్నాయి. తరుచూ జనావాసాల్లోకి చొరబడుతూ ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అనేక చోట్ల చిరుతలు కనిపించాయి. కొన్నిచోట్ల ఆవులు, దూడలను తినేశాయి. తాజాగా హైదరాబాద్ కూకట్పల్లిలోని ప్రగతినగర్లో చిరుత కనిపించడం కలకలం రేపింది. ప్రగతినగర్-గాజుల రామారం మధ్య కొండలపై చిరుత కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుత తిరుగుతున్న దృశ్యాలను స్థానికులు కొందరు సెల్ఫోన్లో చిత్రీకరించారు. చిరుత ఎటునుంచి వచ్చి తమపై దాడి చేస్తుందోనన్న భయంతో ప్రగతినగర్ వాసులు హడలి పోతున్నారు. దీంతో బుధవారం ఉదయం ఒక్కరు కూడా మార్నింగ్ వాక్కు వెళ్లకుండా ఇళ్లకే పరిమితమయ్యారు. చిరుత సంచారంపై పోలీసులు, ఫారెస్ట్ అధికారులకు స్థానికులు సమచారం ఇచ్చారు. దాన్ని పట్టుకునేందుకు బోనులు ఏర్పాటుచేయాలని ప్రగతినగర్ వాసులు కోరుతున్నారు. చిరుతలు జనావాసాల్లోకి వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, ప్రజల ప్రాణాలకు లెక్కలేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిరుత దాడిలో ఒక్కరి ప్రాణం పోయినా
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2yrhoFu
0 Comments