మేనకోడలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు మంగళవారం ప్రకటించారు. తన రాజకీయ జీవితం నిరుత్సాహానికి గురిచేసిందని దీపా వ్యాఖ్యానించారు. అంతేకాదు, మహిళలు రాజకీయాల్లో మనుగడ సాగించడం కష్టసాధ్యమని పేర్కొన్నారు. డిసెంబరు 2016లో దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత దీపా తెరపైకి వచ్చారు. తన మేనత్తను చూడటానికి హాస్పిటల్లోకి అనుమతించలేదంటూ ప్రకటించిన సంచలనం సృష్టించారు. తాను రాజకీయాల్లోకి పునఃప్రవేశం చేసే అవకాశమే లేదని, ఏ వృత్తిలోనైనా మహిళలు ఏకాంతం, స్వేచ్ఛను కోరుకుంటారని దీపా జయకుమార్ అన్నారు. అయితే, తనను నిరంతరం పలు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు, మాటలతో వేధింపులకు గురిచేశారని, సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన ఓ మహిళగా నేను వాటిని జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన భాషతో తనపై చేస్తున్న వాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండంచారు. దివంగత జయలలిత 69వ జయంతి సందర్భంగా 2018 ఫిబ్రవరిలో ఎంజీఆర్ అమ్మ దీప పెరవై పేరిట కొత్తపార్టీని దీపా స్థాపించారు. అయితే, ఈ ఏడాది మార్చిలో ఆ పార్టీని అన్నాడీఎంకేలో విలీనం చేశారు. రాజకీయాల్లోకి తాను బలవంతంగా వచ్చానని వివరించారు. నాకు జీవితంలో కొన్ని ఆశయాలున్నాయని, ప్రజల కోసం మంచి పని చేయాలని అనుకున్నా గానీ, స్వేచ్ఛగా పనిచేయలేకపోయానని అన్నారు. మనుగడ కోసం రాజకీయాల్లో వచ్చిన చాలా మంది తప్పుడు విధానాలను అవలంభిస్తారని, వారితో తాను ఏకీభవించనని దీపా స్పష్టం చేశారు. అంతేకాదు, తనది విభిన్నమైన విధానమని, అనేక మంది నమ్మద్రోహానికి పాల్పడి మోసం చేశారని వాపోయారు. ఇక, రాజకీయాల్లోకి ప్రవేశించాలని తనకు ఆసక్తి లేనప్పటికీ, ప్రజల కోరిక మేరకు అడుగుపెడుతున్నట్టు గతంలో దీపా ప్రకటించారు. దీపా జయకుమార్, ఆమె భర్త మధ్య విభేదాలు తలెత్తడంతో ఆయన సొంతంగా ఓ పార్టీని కూడా పెట్టారు. కాగా, 2017లో ఆయనతో గొడవల కారణంగా కలతచెందిన దీప ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీపా డ్రైవర్ రాజా తనను చంపుతానని బెదిరిస్తున్నట్లు పోలీసులకు మాధవన్ ఫిర్యాదు కూడా చేశాడు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2ynQA95
0 Comments