ట్రిపుల్ తలాక్ ఎఫెక్ట్: కాంగ్రెస్‌ పార్టీకి రాజ్యసభ ఎంపీ తలాక్.. భార్యతో పాటు బీజేపీలోకి!

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బిల్లుపై మంగళవారం (జులై 30) రాజ్యసభలో వాడీవేడి చర్చ కొనసాగుతోంది. ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు - 2019 పేరుతో లోక్‌సభలో ట్రిపుల్ తలాక్ బిల్లును ఆమోదింపజేసుకున్న బీజేపీ ప్రభుత్వం రాజ్యసభలోనూ గట్టెక్కించాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ బిల్లును కాంగ్రెస్ సహా విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ట్రిపుల్ తలాక్ బిల్లు ఎఫెక్ట్ మొదట కాంగ్రెస్ పార్టీపైనే పడింది. బిల్లుపై పార్టీ వైఖరిని వ్యతిరేకిస్తూ ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, రాజ్యసభ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. Read Also: బుధవారం అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరుతున్నట్లు సంజయ్ సింగ్ తెలిపారు. అసోం నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న ఆయన 2019 లోక్‌సభలో సుల్తాన్‌పూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, బీజేపీ అభ్యర్థి మేనకా గాంధీ చేతిలో ఓటమి పాలయ్యారు. ఉత్తరప్రదేశ్‌లో అమేథికి చెందిన సంజయ్ సింగ్ కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. "నేను 1984 నుంచి కాంగ్రెస్‌లో కొనసాగుతున్నా. పార్టీలో ఎప్పుడూ జరగని పరిణామాలు గత పదిహేనేళ్లలో చోటు చేసుకున్నాయి. పార్టీలో సరైన నాయకత్వ లేమి కారణంగానే వైదొలగుతున్నా" అని ఆయన సంజయ్ సింగ్ పేర్కొన్నారు. సంజయ్ సింగ్‌తో పాటు ఆమె కూడా.. ప్రధాని మోదీ సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ నినాదం నచ్చే బీజేపీలో చేరుతున్నట్లు సంజయ్ సింగ్ వెల్లడించారు. సంజయ్ సింగ్‌తో పాటు ఆయన భార్య అమీతా సింగ్ కూడా కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఆమె ఆలిండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ యూపీ విభాగానికి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరి రాజీనామాతో కాంగ్రెస్ నేతలు షాక్‌కు గురయ్యారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2YtKO0j

Post a Comment

0 Comments