మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎంపీ . హత్య తర్వాత పరిణామాలతో పాటూ ఎన్టీఆర్ హయాంలో మద్యపాన నిషేధాన్ని ఎత్తివేయడంపై బాబును టార్గెట్ చేశారు. ట్విట్టర్ వేదిక తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజకీయం కోసం ఎంతకైనా దిగజారతంటూ మండిపడ్డారు. ‘హింస, విధ్వంస రాజకీయాలకు ఆద్యులు తమరు కాదా గారూ. పరిటాల రవి ఫ్యాక్షన్ హత్య తర్వాత జిల్లాలకు ఫోన్లు చేసి ఎన్ని బస్సులు తగలబెట్టాలి. ఎవరెవరిపై దాడులు చేయాలో పార్టీ నాయకులకు టార్గెట్లు పెట్టిన చరిత్రను మర్చిపోయారా? రాజకీయ మనుగడ కోసం ఎంత నీచానికైనా దిగజారే స్వభావం మీది’అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీ లాక్కున్నాక, ఆయన విధించిన మద్యనిషేధాన్ని దేశమంతా అమలు చేయిస్తానని కోతలు కోశారు చంద్రబాబు. ఆ తర్వాత లిక్కర్ లాబీతో కుమ్మక్కై నిషేధం ఎత్తేశారు. జగన్ గారు దశల వారిగా నిషేధం పెడతానంటే మతి భ్రమించిన విమర్శలు చేస్తున్నారు’అంటూ ఘాటుగా విమర్శించారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2yg9ij7
0 Comments