సీఎంకు గిఫ్ట్ ఇచ్చిన మేయర్.. రూ.500 ఫైన్

ఇటీవల అనూహ్య మలుపులు తిరిగిన కర్ణాటక రాజకీయం ఓ కొలిక్కి వచ్చింది. జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ సర్కారు కూప్పకూలగా.. కర్ణాటక సీఎం పదవికి కుమారస్వామి రాజీనామా చేశారు. ఆపరేషన్ కమలం విజయవంతంగా పూర్తి కావడంతో.. బీజేపీ నేత సీఎం పదవిని చేపట్టారు. కొత్తగా సీఎం బాధ్యతలు చేపట్టిన యడ్డీకి శుభాకాంక్షలు చెప్పేందుకు నేతలు క్యూ కడుతున్నారు. గంగాబికే మల్లికార్జున్ కూడా యడియూరప్పకు శుభాకాంక్షలు చెప్పారు. కానీ ఆమె రూ.500 ఫైన్ కట్టారు. సీఎంకు బహుమతిగా ఇవ్వడం కోసం పండ్లను ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసి తీసుకురావడమే దీనికి కారణం. 2016లో బెంగళూరు మహానగర పాలక సంస్థ ప్లాస్టిక్‌పై నిషేధం విధించింది. ఇటీవల ప్లాస్టిక్ నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తోంది. అందులో భాగంగానే.. రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరించిన బెంగళూరు మేయర్‌కు ఫైన్ వేశారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2KhA1m5

Post a Comment

0 Comments