కస్టమర్‌లా వచ్చి డైమండ్ నెక్లెస్ మింగేశాడు.. సీసీటీవీ వీడియో చూస్తే గానీ!

గల దుకాణం సిబ్బంది కళ్లుగప్పి ఓ ఘరానా మోసగాడు రూ.1.5 లక్షల విలువ గల నెక్లెస్ మింగేశాడు. ఆ తర్వాత మెల్లిగా షో రూమ్ నుంచి జారుకున్నాడు. అతడు వెళ్లిపోయాక గానీ.. నెక్లెస్ అపహరణకు గురైన విషయాన్ని సిబ్బంది గుర్తించలేకపోయారు. అంతేకాదు.. సీసీటీవీ ఫుటేజీలను చూశాక అసలు విషయం తెలిసింది. నోయిడాలోని టీజీఐపీ మాల్‌లో గత ఆదివారం (జులై 28) చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగలు కొనే కస్టమర్ మాదిరిగా టీజీఐపీ మాల్‌కు ఓ వ్యక్తి దర్జాగా వచ్చాడు. డైమండ్స్ నెక్లెస్‌కు సంబంధించిన పలు మోడళ్లను చూపెట్టాల్సిందిగా సిబ్బందిని కోరాడు. ఈ క్రమంలో వారిని తప్పుదోవపట్టించి.. తన ఎదురుగా ఉన్న ఓ డైమండ్ నెక్లెస్‌ను నోట్లో వేసుకొని అమాంతం మింగేశాడు. ఆ తర్వాత అక్కడ నుంచి మెల్లిగా జారుకున్నాడు. స్టోర్‌లో ఎంత వెతికినా నెక్లెస్ కనిపించలేదు. సదరు వ్యక్తి ప్రవర్తనపై అనుమానంతో మరుసటి రోజు సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించిన సిబ్బంది.. అతడు నెక్లెస్‌ను అమాంతం మింగేస్తున్న దృశ్యాలను చూసి నోరెల్లబెట్టారు. స్టోర్ నిర్వాహకులు గత గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేటీల ఆధారంగా నిందితుడిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3375YVv

Post a Comment

0 Comments