‘సిరా మరక చెరగనేలేదు, మంగళగిరి మాలోకం ఏడుపు లంకించుకున్నాడు’

వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు మరోసారి ట్విట్టర్ వేదికగా టీడీపీ నేతలు దేవినేని ఉమా, నారా లోకేశ్‌లపై విమర్శలు గుప్పించారు. పోలవరం గురించి అడిగితే ప్రభుత్వం పారిపోతోందన్న ఉమా వ్యాఖ్యలకు విజయసాయి కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో టీడీపీని టార్గెట్ చేయడానికి కేటాయించిన సమయం పోలవరంపై చర్చించి ఉంటే బాగుండేదన్న మాజీ మంత్రి వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ నేత స్పందించారు. ‘‘ప్రాజెక్టుల పనులకు రివర్స్ టెండరింగ్ అమల్లోకి వస్తుందనగానే మీకు, మీ అధినేతకు వెన్నులో వణుకు పుడుతుందా ఉమా? పోలవరంలో మీరు దోచుకున్న ప్రతి రూపాయి కక్కిస్తాం. మీలాగా కుల, వర్గ బలహీనతలు సీఎం జగన్ గారికి లేవు. చూస్తారుగా తొందరెందుకు?’’ అని ట్వీట్ చేశారు. ‘‘అవినీతి లేని రాష్ట్రంగా ఏపీకి కొత్త ఇమేజి తీసుకొస్తామని సీఎం గారు చెబుతుంటే పచ్చ పార్టీ నేతలు పరిశ్రమలు రావని అంటున్నారు. గతంలో ఐటీ, ఈడీ దాడులు జరిగితే ఇలాగే మాట్లాడారు. కరెప్షన్‌ను వ్యవస్థీకృతం చేసిన చంద్రబాబు గారు అది లేకుండా పనులెలా జరుగుతాయనడంలో వింతేమీ లేద’’ని ఆయన మరో ట్వీట్ చేశారు. టీడీపీ నేత ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శిస్తుండటం పట్ల విజయసాయి సెటైర్లు వేశారు. ‘‘ప్రజల వేళ్లపై పోలింగు రోజు వేసిన సిరా మరక ఇంకా చెరగనేలేదు. అప్పుడే గుండెలు బాదుకునే బ్యాచ్‌ వీధుల్లోకి వచ్చింది. మంగళగిరి ప్రజలు పొర్లించి కొట్టిన మాలోకానికి కాస్త వేచి చూడాలన్న స్పృహ కూడా లేదు. అప్పుడే ఏడుపు లంకించుకున్నాడ’’ని ఎద్దేవా చేశారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2yspMEP

Post a Comment

0 Comments