గోదావరికి వచ్చే వరదలతో ముంపు గ్రామాల్లో ప్రజలు ఇబ్బంది పడుతుంటే.. మరోవైపు అదే కొంతమందికి ఉపాధి తెచ్చి పెడుతోంది. వరద ప్రవాహం కారణంగా ఎగువ నుంచి ఎంతో విలువైన కలప, వంట చెరకు కొట్టుకొస్తోంది. దిగువ ప్రాంతాల ప్రజలు దీన్ని ప్రవాహం నుంచి బయటకు లాగుతున్నారు. అలా వచ్చిన కొట్టుకొచ్చిన చెట్లలో ఎంతో విలువైన టేకు కూడా ఉంటుండటం గమనార్హం. వరదలో కొట్టుకొచ్చిన టేకు చెట్లని విక్రయించడం ద్వారా కొందరు భారీగా ఆర్జిస్తున్నారు. చిన్న చిన్న చెట్లను వంట చెరకుగా వినియోగిస్తున్నారు. ఒక్కోసారి వరద ప్రవాహంలో టేకు, మద్ది, ఎరచందనం లాంటి విలువైన చెట్ల కలప కూడా కొట్టుస్తుంది. అలాంటివి తగిలితే బంపర్ ఆఫర్ తగిలినట్టే. ధవళేశ్వరం దిగువన వందలాది మంది ఇలా కట్టెలు లాగే పనిలో నిమగ్నం అవుతున్నారు. ఇలా పోగేసిన కట్టెలు టన్నుల్లో ఉంటున్నాయి. ఎగువన ఉన్న అటవీ ప్రాంతాల నుంచి ఒక్కోసారి భారీ దుంగలు కొట్టుకొస్తుంటాయి. వర్షాకాలానికి ముందు గోదావరిలో నీటి ప్రవాహం తక్కువగా ఉంటుంది. దీంతో ఛత్తీస్గఢ్ మీదుగా టేకు కలపను తరలించడానికి స్మగ్లర్లు గోదావరిని మార్గంగా ఉపయోగించుకుంటున్నారు. కొన్నిసార్లు అలా వదిలేసిన కలప వరదలొచ్చినప్పుడు కిందకు కొట్టుకొస్తుంది. దీనికోసం ప్రాణాలను పణంగా పెట్టి మరీ కొందరు నదీ ప్రవాహానికి ఎదురెళ్తున్నారు. చదవండి:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2YqeoIP
0 Comments