గోదావరి వరద.. కోతకు గురవుతున్న వందలాది ఎకరాల భూమి

ఏటా వర్షాకాలం వరదలు రావడం సాధారణం. ఎగువ ప్రాంతాల్లో ఈ వరదల ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ.. ఉభయగోదావరి జిల్లాలపై మాత్రం ఎక్కువగానే ఉంటోంది. ధవళేవ్వరం బ్యారేజీ దిగువ ప్రాంతాల్లో వరద కారణంగా లంక గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. గోదావరి ప్రవాహం ధాటికి తూర్పు గోదావరి జిల్లాలో ఎంతో విలువైన భూములు నదిలో కలిసిపోతున్నాయి. ప్రవాహ వేగానికి నదీ తీరంలోని భూములు తీవ్రంగా కోతకు గురవుతున్నాయి. బడుగువాని లంకలోనే గత ఇరవై ఏళ్లల్లో 300 ఎకరాల భూమి కోతకు గురైందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గోదావరికి వరద వస్తే చాలు.. తమ కళ్లముందే నీటిలో కలిసి పోతున్న భూముల్ని చూసుకొని అక్కడి రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. భూములు కోతకు గురికాకుండా గోడ కట్టాలని ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1977 రికార్డుల ప్రకారం ఆలమూరు మండలం బడుగువానిలంకలో 770 ఎకరాల భూమి గోదావరిలోని గౌతమీ పాయ ఒడ్డున ఉండగా.. ఇప్పుడు కేవలం 420 ఎకరాల భూమి మాత్రమే ఉంది. మిగిలినదంతా గోదావరిలోనే కలిసిపోయింది. ఈ భూములన్ని సారవంతమైన భూములు కావడం గమనార్హం. ఏడాదికి మూడు పంటలు పండే భూముల్లో వేలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2YK13uj

Post a Comment

0 Comments