కశ్మీర్‌లో ఏం జరుగుతోంది.. నేతల ఆందోళన, తామంతా ఒకటేనని ప్రకటన

మ్మూ కశ్మీర్‌లో ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. తాజాగా అక్కడ మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ప్రజల్లో గందరగోళం పెరిగింది. ఆదివారం (ఆగస్టు 14) కేంద్ర ప్రభుత్వం అక్కడికి మరిన్ని బలగాలను తరలించింది. 10 వేల మందితో ప్రారంభమైన అదనపు బలగాల మొహరింపు 35 వేలకు పైగా చేరింది. వీరిలో సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఎస్ఎస్‌బీ, ఐటీబీపీ జవాన్లు ఉన్నారు. సున్నితమైన, కీలకమైన ప్రాంతాల్లో భద్రతా బలగాలను భారీగా మోహరించారు. ప్రధాన ప్రాంతాల్లో బారికేడ్లను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. కశ్మీర్‌లో ఏదో జరుగబోతోందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. Read Also: పెట్రోలు, నిత్యావసర సరకుల కోసం ప్రజలు బారులు తీరారు. గ్యాస్ రీఫిల్ కోసం గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. మరోవైపు పర్యాటకులు లేక దాల్ సరస్సు వెలవెలబోతోంది. కశ్మీర్ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరు పట్ల విపక్షాలు విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. ఫరూక్ నివాసంలో నేతల సమావేశం.. కశ్మీర్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో రాజకీయాలకు అతీతంగా అక్కడి నేతలంతా సమావేశమయ్యారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్ అబ్దుల్లా నివాసంలో పార్టీలన్నీ కలిసి ఆదివారం సాయంత్రం సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. కశ్మీర్‌లో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, సైనిక బలగాలను మోహరించడంపై నేతలందరూ చర్చించారు. అమర్‌నాథ్‌ యాత్రను అర్థంతరంగా నిలిపివేయటం ఇంతకు ముందెప్పుడు జరగలేదని.. దీనిపై ప్రధాని మోదీ ఓ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కశ్మీర్ విషయంలో తామంతా ఏకధాటిపై ఉన్నట్లు స్పష్టం చేశారు. భారత్‌, పాకిస్థాన్‌ రెండు దేశాలు కూడా కశ్మీర్‌ విషయంలో అచితూచి వ్యవహరించాలని.. లేకుంటే కశ్మీర్‌ లోయలో ఉత్పన్నమయ్యే పరిణామాలు ఊహకు కూడా అందవని ఫరూక్‌ అబ్దుల్లా అన్నారు. కశ్మీర్‌లో శాంతి స్థాపనకు అన్ని రాజకీయ పార్టీలూ సహకరించి జమ్ము-కశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని సంరక్షించాలని కోరారు. ప్రజల ఆగ్రహాన్ని చూడాల్సి ఉంటుంది.. కశ్మీర్‌లో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు ప్రజా సంఘాలు, ట్రేడ్‌ యూనియన్లు, మత సంస్థలు అన్ని కూడా ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని మాజీ సీఎం, పీడీపీ అధినేత పిలుపునిచ్చారు. ఆర్టికల్‌ 35ఏ, 370లతో కేంద్రం ఆడుకుంటోందని.. అదేమని ప్రశ్నిస్తే అంతా బాగానే ఉందంటూ బుకాయిస్తోందని మండిపడ్డారు. నియంత్రణ రేఖ వద్ద యుద్ధం తరహా వాతావరణం నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. రేపు ఏదైనా జరగరానిది జరిగితే ప్రజల అగ్రహావేశాలను కేంద్రం చూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. Read Aslo: కశ్మీర్‌లో అదనపు బలగాల మోహరింపులతో కొద్ది రోజుల కిందట మొదలైన అనిశ్చితికి అమర్‌నాథ్‌ యాత్రికులు, పర్యాటకులు సాధ్యమైనంత త్వరగా రాష్ట్రాన్ని వీడి వెళ్లిపోవాలంటూ శుక్రవారం జారీ అయిన ప్రకటనతో రాష్ట్రంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఆదివారం హోం మంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమావేశంతో ఉత్కంఠ తీవ్రమైంది. యాత్రికులు, పర్యాటకులు స్వస్థలాలకు తిరుగు ముఖం పట్టారు. దీంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు రద్దీగా మారాయి. ఆదివారం కశ్మీర్ రిజర్వేషన్ సవరణ బిల్లు పేరుతో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోవల్‌, ఇంటెలిజెన్స్‌ బ్యూరో చీఫ్‌ అర్వింద్‌ కుమార్‌, రా (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) అధిపతి సమంత్‌ గోయల్‌, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్‌ గౌబాతో సమావేశం నిర్వహించారు. కశ్మీర్‌లో ఏదో జరగబోతోందనే వార్తలకు ఇది మరింత ఊతమిచ్చింది. సోమవారం కేంద్రం మంత్రివర్గ సమావేశంలో కశ్మీర్‌పై కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోనుందనే ఊహాగానాల మధ్య అటు పాకిస్థాన్‌ కూడా అప్రమత్తమైంది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2LZtKNZ

Post a Comment

0 Comments