స్వతంత్ర భారత దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. జమ్మూ కశ్మీర్.. దేశంలో సంపూర్ణంగా విలీనమైంది. దేశ ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు -2019’కు పార్లమెంట్ ఉభయసభలు ఆమోదముద్ర వేశాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవిండ్ ఆమోదంతో వెంటనే ఇది చట్టం రూపంలో అమల్లోకి రానుంది. సోమవారం రాజ్యసభలో ఆమోదం పొందిన ‘జమ్ముూ కశ్మీర్ విభజన బిల్లు’పై లోక్సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. చర్చ అనంతరం నిర్వహించిన ఓటింగ్లో 370-70 ఓట్లతో బిల్లును సభ ఆమోదించింది. Read Also: దశాబ్దాలుగా కశ్మీర్ విషయంలో కొరకరాని కొయ్యలా మారిన ఆర్టికల్ 370కి లోక్సభ ముగింపు పలికింది. ఆర్టికల్ 370 రద్దుకు అనుకూలంగా 351 మంది సభ్యులు ఓటు వేయగా.. 72 మంది వ్యతిరేకించారు. ఒక సభ్యుడు ఓటింగ్కు దూరంగా ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దుకు ఉభయ సభల ఆమోదం లభించడంతో జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణానికి ముగింపు పలికినట్లైంది. ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక రాజ్యాంగం, అధికారాలు రద్దయ్యాయి. ఇకపై భారత రాజ్యాంగంలోని నిబంధనలన్నీ జమ్మూ కశ్మీర్కు సంపూర్ణంగా వర్తించేందుకు వీలు కలిగింది. జమ్మూ కశ్మీర్లో స్థానికతను నిర్వచించడానికి, వారికి ప్రత్యేక హక్కులు కల్పించడానికి ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఇచ్చిన ఆర్టికల్ 35ఎ కూడా ఈ చర్యతో అటకెక్కింది.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2MLyE0z
0 Comments