C17 Aircraft‌: అమర్‌నాథ్ యాత్రికుల తరలింపు.. రంగంలోకి ఎయిర్‌ఫోర్స్

చరిత్రలోనే తొలిసారి అర్ధంతరంగా యాత్రను నిలిపేసిన ప్రభుత్వం తక్షణమే రాష్ట్రం నుంచి వెనక్కి వెళ్లాలని యాత్రికులు, పర్యాటకులకు సూచించింది. యాత్రికులను త్వరితగతిన కశ్మీర్ లోయ నుంచి వెనక్కి పంపడం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం సాయాన్ని కోరింది. దీంతో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సీ-17 గ్లోబ్‌మాస్టర్ రవాణా విమానాలను కశ్మీర్ పంపించింది. మరి కాసేపట్లో ఆ విమానాల్లో ప్రయాణికులను వెనక్కి తీసుకురానున్నారు. ఇప్పటికే సీ-17 గ్లోబల్ మాస్టర్ విమానాల్లో పారమిలిటరీ బలగాలను దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కశ్మీర్ లోయకు తరలిస్తున్నారు. ఈ విమానం ఒకేసారి 230 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలదు. పాకిస్థాన్‌కు చెందన జైషే మహ్మద్ ఉగ్రవాదులు యాత్రికులపై దాడులకు పాల్పడొచ్చనే నిఘా సమాచారంతో జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం అమర్‌నాథ్ యాత్రను అర్ధంతరంగా ఆపేసింది. శ్రీనగర్-బారాముల్లా-ఉరి జాతీయ రహదారిపై ఆర్మీ కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు బాంబు పేలుళ్లకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2T39egg

Post a Comment

0 Comments