Sushma Swaraj: ఆ లాయర్‌తో చెప్పిన చివరి మాటలివే..

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మంగళవారం రాత్రి హార్ట్ అటాక్‌తో మరణించారు. గుండె పోటుతో కుప్పకూలిన ఆమెను హుటాహుటిన ఎయిమ్స్‌కు తరలించారు. ఆమెను బతికించడానికి ఐదుగురు సభ్యుల డాక్టర్ల బృందం 70 నిమిషాలపాటు తీవ్రంగా ప్రయత్నించింది. కానీ వారి ప్రయత్నాలేవీ ఫలించలేదు. దీంతో ఆమె మరణించినట్టు డాక్టర్లు ప్రకటించారు. సుష్మా స్వరాజ్ చనిపోవడానికి కొద్ది గంటల ముందు కూడా ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశారు. అంతకు ముందు ఆమె.. అంతర్జాతీయ న్యాయస్థానంలో కుల్‌భూషణ్ జాదవ్ కేసు వాదించిన లాయర్ హరీశ్ సాల్వేకు ఫోన్ చేశారు. జాదవ్ కేసు వాదించినందుకు గానూ వెలకట్టలేని రూ.1 ఫీజు తీసుకెళ్లేందుకు బుధవారం రావాలని హరీశ్ సాల్వేకు సుష్మా సూచించారు. మంగళవారం రాత్రి 8.50 గంటలకు సాల్వేకు ఫోన్ చేసిన ఆమె.. కాసేపటికే గుండె పోటుతో హఠాన్మరణం చెందారు. ‘‘మంగళవారం రాత్రి 8.50 గంటలకు నేను సుష్మాతో మాట్లాడాను. నువ్వు వచ్చి నన్ను కలువు. జాదవ్ కేసు గెలిచినందుకు నీకు ఇస్తానన్న ఒక్క రూపాయి ఫీజు తీసుకెళ్లని ఆమె చెప్పారు. విలువైన ఆ మొత్తాన్ని తీసుకోవడానికి వస్తానని చెప్పాను. బుధవారం ఉదయం ఆరు గంటలకు రండి’’ అని ఆమె చెప్పారని టైమ్స్ నౌకు చెప్పారు. భారత నౌకాదళ మాజీ అధికారి అయిన కుల్‌భూషణ్ జాదవ్‌కు పాకిస్థాన్ మిలటరీ కోర్టు ఉరిశిక్ష విధించగా.. ఈ తీర్పును సవాల్ చేస్తూ మోదీ సర్కారు అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కుల్‌భూషణ్ తరఫున ఈ కేసును హరీశ్ సాల్వే వాదించారు. సుప్రీం కేసుల్లో కోట్లాది రూపాయల ఫీజును వసూలు చేసే ఆయన.. దేశం కోసం కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఫీజు‌గా తీసుకున్నారు. గత ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా పని చేసిన సుష్మ స్వరాజ్ ఈ విషయాన్ని అప్పట్లో ట్వీట్ ద్వారా తెలిపారు. కుల్‌భూషణ్‌ ఉరి తీయడాన్ని ఆపాలని, ఈ తీర్పు పునఃసమీక్షించాలని గత నెలలో ఐసీజే తీర్పు వెలువరించింది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2OGgfop

Post a Comment

0 Comments