Amalapuram: డాక్టర్ కొంపముంచిన రైస్ పుల్లింగ్ ముఠా.. అందుకే ఆత్మహత్య

తూర్పుగోదావరి జిల్లా పట్టణంలో ఆర్థోపెడిక్ డాక్టర్ రామకృష్ణరాజు భార్య, కుమారుడితో సహా ఆత్మహత్య చేసుకున్న కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆత్మహత్యలకు రైస్ పుల్లింగ్ ముఠానే కారణమని విచారణలో తేలింది. డాక్టర్ రాసిన లేఖ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రధాన నిందితుడు వేణుధర ప్రసాద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆయన ద్వారా వివరాలను ఆరా తీస్తున్నారు. Also Read: అమలాపురంలో శ్రీకృష్ణా ఆర్థోపెడిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వహిస్తున్న రామకృష్ణరాజు సంపాదించిన ఆస్తినంతా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టారు. అయితే కాలం కలిసిరాక అందులో నష్టాలు వచ్చి పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయారు. బ్యాంకుల నుంచి పెద్దమొత్తంలో లోన్లు తీసుకోవడంతో పాటు అధిక వడ్డీలకు ఫైనాన్షియర్ల దగ్గర డబ్బులు తీసుకున్నారు. అప్పుల బాధ నుంచి ఎలా బయటపడాలన్న ఆందోళనతో ఉన్న ఆయనకు హైదరాబాద్‌కు చెందిన రైస్ పుల్లింగ్ ముఠా సభ్యులు వేణుధర ప్రసాద్, అనంతరామ్‌తో పరిచయం ఏర్పడింది. Also Read: రైస్ పుల్లింగ్ యంత్రం ఇంట్లో ఉంటే అప్పులన్నీ తీరిపోయి సరిసంపదలు కలుగుతాయని డాక్టర్‌ను వారిద్దరు నమ్మించారు. ఆయనకు హైదరాబాద్‌కే చెందిన షేక్ షానలీన్ అనే వ్యక్తిని ఆయనకు పరిచయం చేశారు. రైస్ పుల్లింగ్ యంత్రం పేరుతో డాక్టర్ నుంచి రూ.5కోట్లు దండుకున్నారు. అయితే కొద్దిరోజులకే తాను మోసపోయినట్లు తెలుసుకున్న డాక్టర్ రామకృష్ణరాజు తన డబ్బు తిరిగిచ్చేయాలని వారిని కోరగా బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆ డబ్బు సంగతి మరిచిపోవాలని, లేదంటే కుటుంబాన్ని మొత్తం అంతం చేస్తామని హెచ్చరించారు. దీంతో ఆయన కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 30వ తేదీన భార్య, పెద్ద కొడుకు డాక్టర్ కృష్ణ సందీప్‌తో కలిసి సెలైన్‌లో విషం కలిపి ఎక్కించుకుని ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో చిన్న కొడుకు వంశీ కృష్ణంరాజు అనాథగా మిగిలాడు. Also Read: డాక్టర్ రామకృష్ణరాజు సూసైడ్ లేఖను పరిశీలించిన పోలీసులకు రైస్ పుల్లింగ్ ముఠా ప్రస్తావన రావడంతో ఆ దిశగా విచారణ చేపట్టారు. ప్రధాన నిందితుడు వేణుధర ప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. కోనసీమ ప్రాంతంలో మంచి హస్తవాసి గల డాక్టర్‌గా ప్రసిద్ధి చెందిన రామకృష్ణరాజు కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడటాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని పలువురు కన్నీటి పర్యంతమవుతున్నారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2ZMYPXA

Post a Comment

0 Comments