AP Tourism: పర్యాటకంలో ఆంధ్రా బెస్ట్.. రాష్ట్రానికి జాతీయ అవార్డు

ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా 2017-18 జాతీయ టూరిజం అవార్డులను ప్రకటించారు. ఢిల్లీలోని ప్రజ్ఞాన్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా అవార్డులను అందజేశారు. పర్యాటక రంగంలో వృద్ధి సాధించిన ఉత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది. విశాఖ రైల్వే స్టేషన్‌కు బెస్ట్ రైల్వే స్టేషన్ అవార్డు లభించింది. ఉత్తమ కాఫీ టేబుల్‌ బుక్‌ కేటగిరీలోనూ ఏపీకి ప్రథమస్థానం లభించింది. అడ్వెంచర్‌ టూరిజం కేటగిరీలో గోవా, మధ్యప్రదేశ్ అవార్డులను పొందాయి. సినిమా ప్రమోషన్లకు ఉత్తమ స్నేహపూర్వక రాష్ట్రంగా ఉత్తరాఖండ్‌ ఎంపికైంది. తెలంగాణ పర్యాటక శాఖకు ఈ ఏడాది రెండు అవార్డులు దక్కాయి. టూరిస్టులకు పర్యాటక ప్రదేశాలకు సంబంధించి విస్తృత సమాచారం అందించడం కోసం పర్యాటక శాఖ రూపొందించిన "ఐ ఎక్స్‌ప్లోర్ తెలంగాణ" అనే మొబైల్ యాప్‌కు అవార్డు దక్కింది. బెస్ట్ మెడికల్ టూరిజం విభాగంలో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి జాతీయ స్థాయి పర్యాటక అవార్డు దక్కింది. ఐటీ సేవలను వినూత్నంగా వాడుకుంటున్న ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ ఏడాది వివిధ కేటగిరిల్లో మొత్తం 76 అవార్డులను అందజేశారు. భారత్‌లో పర్యాటకులకు రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలుకుతున్నామని వెంకయ్య నాయుడు చెప్పారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2m2Q1iJ

Post a Comment

0 Comments