భారత్తో చర్చల కోసం తామెంతో ప్రయత్నించామని, మోదీ సర్కారు వ్యవహార శైలి వల్ల చర్చలు సాధ్యపడలేదని పాకిస్థాన్ ఆరోపిస్తోన్నసంగతి తెలిసిందే. కశ్మీర్ సమస్యపై న్యూయార్క్ టైమ్స్లో తాను రాసిన ఆర్టికల్లోనూ ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పాక్ ప్రధానికి భారత విదేశాంగ మంత్రి ఎస్ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. ఓవైపు పాకిస్థాన్ సొంత గడ్డ మీద బహిరంగంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ.. మరోవైపు చర్చలు జరపాలంటే సాధ్యపడదని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయ మీడియాతో మాట్లాడిన జైశంకర్.. ఇరు దేశాల మధ్య అత్యవసరంగా చర్చలు జరగాల్సి ఉందన్న ఇమ్రాన్ అభిప్రాయంతో విబేధించారు. పాక్ ప్రధాని రాసిన ఆర్టికల్ చదవలేదన్న జైశంకర్.. పాకిస్థాన్లో ఉగ్రవాదం చీకటి మాటున జరగడం లేదు. అక్కడ ఉగ్రవాదం బహిరంగమేనన్నారు. 2016లో పఠాన్కోట్లోని భారత ఎయిర్ఫోర్స్ బేస్పై పాక్ ఉగ్రవాదులు దాడులు జరిపిన తర్వాత.. భారత్, పాకిస్థాన్ మధ్య చర్చలు రద్దయ్యాయి. కశ్మీర్లో విధించిన ఆంక్షలు తాత్కాలికమేనన్నారు. అదనపు భద్రతా దళాలను కూడా కశ్మీర్ నుంచి వెనక్కి పంపిస్తామన్నారు. కశ్మీర్లో హింసను ప్రేరేపించే వారిని అడ్డుకోవడం; ఉగ్రవాదులకు, వారికి ఆదేశాలు జారీ చేసేవారి మధ్య సంబంధాలు లేకుండా చేయడం కోసమే కశ్మీర్లో ఇంటర్నెట్, ఇతర సమాచార వ్యవస్థలను నిలిపేశామని జైశంకర్ తెలిపారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2ZJIlzp
0 Comments