అభినందన్‌ రీ ఎంట్రీ.. IAF చీఫ్‌‌తో కలిసి యుద్ధ విమానాన్ని నడిపిన వర్ధమాన్‌

బాలకోట్ దాడుల తర్వాత పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్-16 ఫైటర్ జెట్‌ను కూల్చే క్రమంలో శత్రు దేశానికి చిక్కిన ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ తిరిగి విధుల్లో చేరారు. సోమవారం ఉదయం మిగ్-21 యుద్ధ విమానాన్ని ఆయన నడిపారు. వర్ధమాన్‌తోపాటు ఎయిర్‌ చీఫ్ మార్షల్ కూడా యుద్ధ విమానంలో ప్రయాణించారు. సోమవారం మిగ్ 21 ట్రైనర్ వెర్షన్‌ అయిన టైప్ 69 ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను అభినందన్ నడిపారు. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ నుంచి వీరిద్దరూ యుద్ధ విమానంలో ప్రయాణించారు. పాక్ చెర నుంచి విడుదలైన వర్ధమాన్‌తో కలిసి ఎయిర్ చీఫ్ యుద్ధ విమానంలో ప్రయాణించడం ద్వారా.. అభినందన్ పట్ల ఎయిర్‌ఫోర్స్ ఎంత నమ్మకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సందర్భంగా ధనోవా మాట్లాడుతూ.. అభినందన్, నేను ఇద్దరం పాకిస్థాన్‌తో పోరాడామన్నారు. అభినందన్ బాలాకోట్‌లో పోరాడితే... తాను కార్గిల్‌లో పోరాడనని తెలిపారు. అభినందన్ తండ్రితో కలిసి తాను యుద్ధ విమానాలను నడిపానన్నారు. ఇప్పుడు అభినందన్‌తో కలిసి ప్రయాణించడం గౌరవంగా భావిస్తున్నానని ధనోవా తెలిపారు. Read Also: సెప్టెంబర్ 30న రిటైర్ కాబోతున్న ధనోవా యుద్ధ విమానాన్ని నడపటం ఇదే చివరిసారి. ధనోవా స్థానంలో మరో సీనియర్ అధికారి నియామకం కోసం మోదీ సర్కారు కసరత్తును ప్రారంభించింది. ఫిబ్రవరి 27న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పాకిస్థాన్‌లోని బాలకోట్‌పై మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో ఉగ్రవాద శిక్షణ శిబిరం ధ్వంసమైంది. తర్వాత పాక్ ప్రతీకార దాడులకు ప్రయత్నించగా.. భారత్ తిప్పికొట్టింది. పాక్ ఎఫ్-16 ఫైటర్ జెట్‌తో దాడికి యత్నించగా.. మిగ్-21 బైసన్ ద్వారా అభినందన్ దాన్ని కూల్చేశాడు. ఈ క్రమంలో పాక్ ఆక్రమిత కశ్మీర్లోకి వెళ్లాడు. తర్వాత అతణ్ని పట్టుకున్న పాకిస్థాన్ సైన్యం.. అదుపులోకి తీసుకొని విచారించింది. భారత దౌత్య ఒత్తిడితో పాక్ అభినందన్‌ను తిరిగి భారత్‌కు అప్పగించింది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2MQP48G

Post a Comment

0 Comments