Fact Check: కాశ్మీర్ జర్నలిస్ట్‌ను ఆర్మీ చితక్కొట్టిందా. అసలేం జరిగింది?

విషయం ఓ యువకుడిని లాకప్‌లో వేసి కొందరు పోలీసులు కొడుతున్నారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఫహద్ భట్‌ను పోలీసులు చిత్రహింసలకు గురిచేస్తున్నారని కొందరు నెటిజన్లు చేసిన పోస్టులు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇండియన్ ఆర్మీ ఓ జర్నలిస్టును ఆయన ఇంట్లోనే అరెస్ట్ చేశారు. ఆపై వేధిస్తున్నారు. అయితే ప్రపంచమంతా అమెజాన్ అడవి కార్చిచ్చు గురించి ఆందోలన చెందుతోంది, కానీ కాశ్మీర్ ప్రజల గురించి ఎవరూ ఆలోచించడం లేదని అర్బాజ్ ఖాన్ అనే నెటిజన్ ట్వీట్ చేశాడు. నిజం వాస్తవానికి నెట్టింట వైరల్ అవుతున్న ఫొటో హిందీ టీవీ సీరియల్ ‘మేరి ఆషిఖి తుమ్ సే హి’ స్టిల్స్. రణ్‌వీర్ అనే పాత్రలో కనిపించిన నటుడు శక్తి ఆరోరాను పోలీసులు లాకప్‌లో ఇంటాగేషన్ చేస్తున్నట్లుగా ఉంది. డాక్టర్ సుషి అనే నెటిజన్ దీనిపై స్పందించారు. ఇది కేవలం దుష్ప్రచారం. అతడు కాశ్మీర్ జర్నలిస్ట్ కాదు, టీవీ సీరియల్ ఆర్టిస్ట్ శక్తి ఆరోరా. ఆషిఖి సీరియల్ స్టిల్స్‌ను చూసి మీరు జోకర్లు అవుతున్నారని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఫేక్ ట్వీట్‌తో వివాదానికి తెరతీసిన అర్బాజ్ ఖాన్‌కు అనుప్ సాయారే బదులిచ్చారు. కాశ్మీర్‌లో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని ప్రచారం చేసుకోవడానికి నేను టీవీ సీరియల్ మరికొన్ని స్టిల్స్ పంపిస్తున్నాను. వీటితో నువ్వు ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి నీ ఉద్దేశాన్ని వాప్తి చేయడానికి ట్రై చేసుకో’ అంటూ అనుప్ మండిపడ్డారు. నిర్ధారణ టీవీ సీరియల్ స్టిల్స్‌ను వాడుకుని కాశ్మీర్‌లో శాంతిభద్రతలు కరువయ్యాయని, జర్నలిస్టులను సైతం పోలీసులు వేధిస్తున్నారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టమైంది. ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత నుంచి జమ్మూకాశ్మీర్‌ గురించి నిత్యం ఏదో ఒక అంశంపై ఫేక్ న్యూస్ వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/32l6yh9

Post a Comment

0 Comments