చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈస్ట్ జియాంగ్స్ ప్రావిన్స్లోని చాంగ్చున్-షెంజన్ ఎక్స్ప్రెస్ రోడ్డులో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ముందు వెళ్తున్న ట్రక్కును ఢీకొంది. ఈ ఘటనలో 36 మంది ప్రాణాలు కోల్పోగా మరో 36 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 69 మంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. Also Read: క్షతగాత్రుల్లో 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. మరో 20 మందికి స్వల్పగాయాలయ్యాయని, మరో ప్రయాణికులు ప్రథమ చికిత్స తర్వాత డిశ్చార్జి అయ్యాడని వెల్లడించారు. బస్సు ఎడమ టైరు పంక్చర్ కావడంతో అదుపుతప్పి ముందు వెళ్తున్న ట్రక్కును ఢీకొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనతో ఆ రహదారిపై సుమారు 8గంటల పాటు ట్రాఫిక్ ఆగిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బందుల పాలయ్యారు. చైనాలో ఇటీవల రోడ్డుప్రమాదాల్లో ప్రాణాలు పోతున్నవారి సంఖ్య పెరుగుతోంది. చైనాలో ఒక్క 2015లోనే రోడ్డుప్రమాదాల్లోనే 58వేల మంది చనిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. Also Read: Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2nysQx5
0 Comments