రాజస్థాన్లోని జోధ్పూర్లో ఘోర ఘటన వెలుగుచూసింది. వేధిస్తున్న భర్త నుంచి కాపాడాలని సాయం కోరిన మహిళను ఓ వ్యక్తి ఆరు రోజుల పాటు నిర్బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ కామాంధుడిని నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. Also Read: జిల్లా లోహవత్ గ్రామానికి చెందిన మహిళను భర్త కొంతకాలంగా వేధిస్తున్నాడు. దీంతో విసిగిపోయిన ఆమె భర్త నుంచి రక్షించాలని పరిచయస్థుడైన బాబూలాల్ అనే వ్యక్తిని సంప్రదించింది. దీంతో బాబూలాల్ తన స్నేహితుడితో కలిసి ఆమెను జోధ్పూర్ పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి భర్తపై ఫిర్యాదు చేయించాడు. దీని నిమిత్తం ఆమెకు రెండ్రోజుల పాటు తన నివాసంలోనే వసతి కల్పించాడు. కేసు నమోదైన తర్వాత ఆ మహిళ తన స్వగ్రామం లొహావత్కు వెళ్లిపోయింది. Also Read: కొద్దిరోజుల తర్వాత ఆ మహిళకు ఫోన్ చేసిన బాబూలాల్ పోలీసులు స్టేట్మెంట్ రికార్డు చేసుకునేందుకు పిలుస్తున్నారని చెప్పాడు. దీంతో ఆమె వెంటనే బాబూలాల్ ఇంటికి చేరుకుంది. ఆ వెంటనే మహిళను తన ఇంట్లోని ఓ గదిలో నిర్బంధించిన బాబూలాల్ ఆమెపై ఆరు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడి బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీస్స్టేషన్కు వెళ్లి తనపై జరిగిన అఘాయిత్యంపై ఫిర్యాదు చేసింది. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2zH7L6n
0 Comments