YS Jaganపై ఫిష్ వెంకట్ పేరిట దుష్ప్రచారం.. పోలీసులకు ఫిర్యాదు చేసిన నటుడు

వివాదాలకు దూరంగా ఉండే సినీ నటుడు .. అనూహ్యంగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. తన పేరిట ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసి... అందులో ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై దుష్ప్రచారం చేశారని ఆరోపిస్తూ.. ఆయన సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. ఇందుకు కారణమైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లే లోగానే ఆ ట్విట్టర్ ఖాతాను డిలీట్ చేయడం గమనార్హం. ఫిష్ వెంకట్ కుటుంబీకులు వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి వీరాభిమానులనే సంగతి తెలిసిందే. అలాంటిది ఫిష్ వెంకట్ పేరిట క్రియేట్ చేసిన ట్విట్టర్ అకౌంట్లో ‘‘మీకు మీలాగా సొంత బాబాయిని చంపడం తెలీదు, కోట్ల రూపాయలు కాజేయం తెలీదు. ఈవీఎంతో సీఎం అవడం తెలీదు’’ అని పోస్ట్ చేశారు. దీంతో వైఎస్ఆర్సీపీ అభిమానులు అతడిపై ఫైర్ విషయం. అసలు విషయం తెలిసిన ఫిష్ వెంకట్ వివరణ ఇచ్చారు. ‘‘మా కుటుంబం మొత్తం వైఎస్ వీరాభిమానులం. మాది తెలంగాణ అయినప్పటికీ.. జగన్ సీఎం కావాలని చాలా ఏళ్లుగా కోరుకుంటున్నాం. మేం జగన్ కుటుంబీకులం. జగన్‌తో కలిసి నేను కూడా పాదయాత్రలో పాల్గొన్నాను. నేను చదువుకున్నది మూడో తరగతి వరకే. నా పేరిట సోషల్ మీడియా అకౌంట్లేవీ లేవు’’ అని ఆయన తెలిపారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2HGrLdx

Post a Comment

0 Comments