చైనా సరిహద్దులో ఘర్షణల అంశంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. అఖిలపక్ష భేటీ నిర్వహించడానికి ముహూర్తం ఖరారు చేశారు. శుక్రవారం (జూన్ 19) సాయంత్రం 5 గంటలకు అన్ని పార్టీల అధ్యక్షులతో సమావేశం నిర్వహించి ఈ అంశంపై అభిప్రాయాలు తీసుకోనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో దేశంలోని అన్ని పార్టీల అధ్యక్షులు పాల్గొని తమ అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా ప్రధాని కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో కోరింది. లఢక్లోని గాల్వన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలు తీవ్ర హింసాత్మక ఘటనకు దారి తీసిన సంగతి తెలిసిందే. సోమవారం (జూన్ 15) రాత్రి జరిగిన ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. వీరిలో తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోశ్ బాబు ఉన్నారు. చైనా వైపున కూడా 40 మంది వరకు సైనికులు మరణించినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణల్లో అనేక మంది సైనికులు గాయపడ్డారు. ఇరుదేశాల సైనికులు పరస్పరం రాళ్లు, కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేసుకున్నట్లు తెలుస్తోంది. చైనాతో జరిగిన ఘర్షణల్లో భారత సైనికులు భారీ సంఖ్యలో మరణించడం దేశవాసులను ఆవేదనకు గురిచేస్తోంది. ఈ అంశంపై విపక్షాలు మండిపడుతున్నాయి. అసలు లఢక్ లోయలో ఏం జరుగుతుందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం వాస్తవాలను దాచిపెడుతోందని విమర్శలు గుప్పిస్తున్నాయి. అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేసి.. చైనాపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఆల్ పార్టీ మీటింగ్కు పిలుపు ఇచ్చినట్లు తెలుస్తోంది. Also Read: Must Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2Yal789
0 Comments