పరీక్షల్లో మార్కులు రాలేదని, సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యామని జీవితాలను అర్ధాంతరంగా ముగించేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇంటర్లో ఫెయిల్ అయ్యానన్న బాధతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో తాజాగా వెలుగుచూసింది. నగరంలోని ధర్మపేటకి చెందిన మాదన్నకి ముగ్గురు కూతుళ్లు. చిన్న కుమార్తె సుజాత(17) పత్తికొండలోని గురుకుల పాఠశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. ఇటీవల విడుదలైన పరీక్ష ఫలితాల్లో సుజాత రెండు సబ్జెక్టులో ఫెయిలైంది. ఆ విషయం తెలిసి తల్లి తీవ్రంగా మందలించింది. బుద్ధిగా చదువుకోవాలని హితవు పలికింది. ఫెయిల్ అయినందుకు అమ్మ తిట్టిందని మనస్థాపానికి గురైన బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి బయటికెళ్లి సమీపంలోని కేసీ కెనాల్లో దూకేసింది. Also Read: రాత్రైనా కూతురు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. మరుసటి రోజు మధ్యాహ్నం ఆమె చున్నీ కాల్వలో కనిపించంతో అనుమానం వచ్చి గాలించారు. నీటిలో నుంచి ఆమె మృతదేహాన్ని వెలికితీశారు. విగతజీవిగా కనిపించిన కూతురుని చూసి ఆ తల్లిదండ్రుల గుండెబద్దలైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. Read Also:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2BdCqMv
0 Comments