కట్నం రూ.5వేలు తగ్గిందని భర్త వేధింపులు.. నవవధువు ఆత్మహత్య

ఎన్నో ఆశలతో వివాహ జీవితంలోకి అడుగుపెట్టిన యువతిని కట్న వేధింపులు బలి తీసకున్న ఘటన జిల్లాలో విషాదం నింపింది. నెల రోజుల పాటు హాయిగా సాగిపోయిన ఆమె వైవాహిక జీవితం రెండో నెలకే నరకంగా మారిపోయింది. కట్నం తక్కువగా ఇచ్చారన్న కోపంతో భర్త వేధించడంతో మనస్తాపానికి గురైన ఆమె చివరికి బలవన్మరణానికి పాల్పడింది. తాడికొండ మండలం పాములపాడు గ్రామానికి చెందిన రత్నకుమారి (20)కి లాం గ్రామానికి చెందిన తాపీమేస్త్రి అన్నపురెడ్డి గోపితో మూడు నెలల క్రితం వివాహమైంది. ఇద్దరి కులాలు వేరైనప్పటికీ పెద్దల అంగీకారంతో ఘనంగా వివాహం జరిపించారు. Also Read: వివాహ సమయంలో రూ.50 వేలు కట్నం ఇవ్వడానికి రత్నకుమారి తల్లిదండ్రులు అంగీకరించారు. అయితే డబ్బు మొత్తం సమకూరకపోవడంతో రూ.45 వేలు మాత్రమే ఇవ్వగలిగారు. అత్తమామలు కట్నం తక్కువగా ఇచ్చారన్న కోపంతో గోపీ భార్యను వేధించడం మొదలుపెట్టాడు. నిత్యం శారీరకంగా, మానసికంగా చిత్రహింసలు పెట్టేవాడు. తన సమస్యను తల్లిదండ్రులకు చెప్పి బాధపెట్టడం ఇష్టం లేని రత్నకుమారి వేధింపులను మౌనంగా భరిస్తూ వచ్చింది. Also Read: అత్తమామలు కూడా భర్తకే వత్తాసు పలకడంతో రత్నకుమారి ఒంటరి అయిపోయింది. ఓ వైపు భర్త చిత్రహింసలు భరించలేక, మరోవైపు తల్లిదండ్రులకు తన బాధ చెప్పుకోలేక మనస్తాపానికి గురైంది. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి సునీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాడికొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/37aUOlc

Post a Comment

0 Comments