మహిళల మాన, ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన పోలీసే కీచకుడిగా మారాడు. పెళ్లయిన విషయం దాచిపెట్టి మరో యువతితో ప్రేమాయణం నడిపాడు. ఆమెతో శారీరక వాంఛలు తీర్చుకోవడంతో పాటు పెద్దమొత్తంలో డబ్బులు దోచుకున్నాడు. పెళ్లి పేరెత్తితే ప్రియుడు మొహం చాటేస్తుండటంతో అనుమానం వచ్చిన యువతి ఆరా తీయగా అతడికి అప్పటికే పెళ్లయిందని తెలిసింది. దీంతో షాకైన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఒంగోలులో ఈ ఘటన జరిగింది. Also Read: ఒంగోలులోని ఓ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్ స్థానికంగా ఓ యువతిని ప్రేమ పేరుతో వలలో వేసుకున్నాడు. పెళ్ల చేసుకుంటానని నమ్మించి ఆమెతో శారీరక వాంఛలు తీర్చుకున్నాడు. అంతటితో ఆగకుండా ఆమె నుంచి పలు విడతలుగా భారీ మొత్తంలో డబ్బులు దోచుకున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని యువతి ఎప్పుడు కోరుతున్నా అతడు మొహం చాటేస్తూ వచ్చాడు. దీంతో యువతి ఆరా తీయగా అతడికి అప్పటికే పెళ్లయిందని తెలిసింది. మోసపోయానని గ్రహించిన బాధితురాలు న్యాయపోరాటానికి దిగింది. కానిస్టేబుల్పై తాలూకా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో కానిస్టేబుల్పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2YsIxV4
0 Comments