ఆడపిల్ల పుట్టిందని అత్తింటి వేధింపులు.. వివాహిత ఆత్మహత్య

ఎన్నో ఆశలతో మెట్టినింట అడుగుపెట్టిన ఆమెకు తొలినాళ్లలోనే వేధింపులు స్వాగతం పలికాయి. ప్రేమగా చూసుకోవాల్సిన భర్త, అత్తమామాలు, ఆడపడచు కలిసి అదనపు కట్నం కోసం నిత్యం వేధించారు. తొలి కాన్పులో ఆడపిల్ల పుట్టిందని శారీరకంగా, మానసికంగా వేధించారు. దీంతో తట్టుకోలేకపోయిన ఆ అమాయకురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన జిల్లా లక్షెట్టిపేట మండలం దౌడపల్లి గ్రామంలో జరిగింది. Also Read: దౌడపల్లి గ్రామానికి చెందిన గాగిరెడ్డి సోనియా అలియాస్‌ అలేఖ్య(24)కు కొండపల్లి గ్రామానికి చెందిన గడ్డం మల్లారెడ్డితో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లి సమయంలో కట్నం కింద ఎకరం 10 గుంటల భూమిని అలేఖ్య తండ్రి గంగిరెడ్డి కూతురు, అల్లుడి పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయించారు. వీరికి కూతురు కృతి, కుమారుడు కుమారస్వామి ఉన్నారు. తొలి కాన్పులో అలేఖ్యకు ఆడపిల్ల పుట్టడంతో అత్తింటి వేధింపుల మొదలయ్యాయి. పుట్టింటి నుంచి మరో 20 గుంటల భూమిని తీసుకురావాలంటూ భర్తతో పాటు అత్తమామలు, ఆడపడుచు నిత్యం చిత్రహింసలు పెట్టేవారు. దీనిపై పెద్దల మధ్య పంచాయతీ జరిగినప్పుడు అలేఖ్యను బాగానే చూసుకుంటున్నామని అత్తింటి వారు నమ్మబలికారు. ఆ తర్వాత కూడా ఆమెపై వేధింపులు ఆగలేదు. Also Read: పదిహేను రోజుల కిందట అలేఖ్యకు జ్వరం రావడంతో పుట్టింటికి వచ్చింది. అయితే ఇంట్లో శుభకార్యం ఉందని చెప్పి మల్లారెడ్డి గత నెల 25న ఇంట్లో భార్యను అత్తారింటికి తీసుకువెళ్లాడు. అదే రోజు ఇంట్లో మళ్లీ గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన అలేఖ్య 26వ తేదీన పురుగుల మందు తాగింది. మంచిర్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందింది. అలేఖ్య తండ్రి గండిరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3dSqDS8

Post a Comment

0 Comments