కరోనా రోగులు విషమంగా ఉన్న దేశాల్లో భారత్‌కు‌ రెండో స్థానం.. వరల్డ్ మీటర్స్

మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న వేళ మరో భయానక అంశం బయటకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ బారినపడి ఆరోగ్యం విషమంగా ఉన్న రోగుల సంఖ్యలో భారత్‌ రెండో స్థానంలో ఉన్నట్లు వరల్డ్ మీటర్‌ ప్రకటించింది. కోవిడ్‌-19 సోకినవారిలో అత్యధికంగా అమెరికాలో 16,907 మంది పరిస్థితి విషమంగా ఉండగా.. భారత్‌లో ఈ సంఖ్య 8,944 అని పేర్కొంది. భారత్ కంటే బ్రెజిల్‌లో పాజిటివ్ కేసులు మూడు రెట్లు అధికంగా ఉన్నప్పటికీ అక్కడ విషమంగా ఉన్నవారు 8,318 మాత్రమే. అలాగే, రష్యా (2,300)లో సీరియస్‌ కేసుల సంఖ్య భారత్‌లో నాలుగో వంతు కావడం గమనార్హం. కాగా, దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,987 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, మరో 279 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. కరోనా కేసుల్లో మృతుల సంఖ్య 5 శాతం కంటే తక్కువేనని కేంద్రం తెలిపింది. రోగుల్లో 2.25 శాతం ఐసీయూలో ఉన్నారని పేర్కొంది. దేశంలో వరుసగా ఆరో రోజు 9 వేలపైగా కేసులు నమోదయ్యాయి. హరియాణ, జమ్మూకశ్మీర్‌, అసోం, కర్ణాటక, చత్తీ‌సగఢ్‌, త్రిపుర రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో అంపన్‌ తుఫాను సహాయ చర్యల్లో పాల్గొన్న జాతీయ విపత్తు నిర్వహణ దళం (ఎన్టీఆర్‌ఎ్‌ఫ)కు చెందిన 76 మంది సిబ్బంది కరోనా బారినపడ్డారు. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 9,985 కేసులు నమోదుకాగా.. దేశంలో కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య 2,76,583కి చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. ఇదే సమయంలో కొవిడ్‌-19 మహమ్మారికి బలౌతున్న వారి సంఖ్య ప్రతిరోజు పెరుగుతూనే ఉంది. తాజాగా బుధవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 279మంది మృత్యువాతపడ్డారు. దేశంలో కరోనా సోకి ఇప్పటివరకు 7,745మంది మృత్యువాతపడ్డట్లు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా సోకిన మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 1,35,206 మంది కోలుకోగా మరో 1,33,632 మంది చికిత్స పొందుతున్నట్లు తెలిపింది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/30twtp9

Post a Comment

0 Comments