భార్యని చంపేసిన కానిస్టేబుల్.. నడిరోడ్డుపై కత్తితో హల్‌చల్.. వరంగల్‌లో దారుణం


జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యని భర్త అతి కిరాతకంగా చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అనంతరం కత్తితో నడిరోడ్డుపై హల్‌చల్ చేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. మండలం తిమ్మాపురం పెన్షన్‌పురం కాలనీకి చెందని కానిస్టేబుల్ అయూబ్‌ఖాన్(40) జనగామ జిల్లా రఘునాథపల్లి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య తస్లీమా సుల్తానా(35), ఇద్దరు కుమారులు సంతానం. కోర్టు కానిస్టేబుల్‌గా పని చేస్తున్న అయూబ్ పెన్షన్ పురం రోడ్డుపై కత్తితో హల్‌చల్ చేశాడు. సమీపంలోని టీఎస్‌ఎస్పీ బెటాటియన్‌ గోడ దూకి అక్కడ కత్తితో వీరంగం సృష్టించడంతో అతనిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. స్టేషన్‌కి వెళ్లిన అతని భార్య, బంధువులు విడిపించుకొచ్చారు. భార్యని బైక్‌పై ఎక్కించుకుని ఇంటికి బయల్దేరిన కానిస్టేబుల్ అయూబ్ నేరుగా బెటాలియన్ ప్రధాన ద్వారం నుంచి లోపలికి పోనిచ్చాడు. Also Read: భార్యను హత్య చేశానంటూ సాయంత్రం మరోసారి రోడ్డుపైకి వచ్చి గొడవచేయడంతో బెటాలియన్ సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. అక్కడికి వచ్చిన పోలీసులు కానిస్టేబుల్ అయూబ్‌ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తన భార్యను గొంతునులిమి చంపేశానని.. బెటాలియన్ పాత క్వార్టర్స్‌లో శవం ఉందని చెప్పడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు పాతక్వార్టర్స్‌లో గాలించడంతో భార్య మృతదేహం కనిపించింది. Read Also: ఆమె మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. భార్యని బైక్‌పై ఎక్కించుకుని పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా పాతక్వార్టర్స్‌కి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడే ఆమెను అతి కిరాతకంగా హత్య చేసి పడేసి ఇంటికెళ్లిపోయనట్లు అనుమానిస్తున్నారు. అయితే భార్యని హత్య చేయడానికి కారణాలేంటి? కత్తితో నడిరోడ్డుపై హల్‌చల్ చేయడం తదితర విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2MAvj3l

Post a Comment

0 Comments